Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం ఆరగించిన తర్వాత డయాబెటిక్ రోగులు నడవడం మంచిదా?

చాలా మంది భోజనం తర్వాత నడుస్తున్నారు. పగలు లేదా రాత్రి సమయాలలో భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కొద్దిసేపు నడుస్తుంటారు. ఇలా చేయడం ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు హాని కలుగుతుందా లేదా ఆరోగ్యంగా ఉంటారా అనే విష

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (10:03 IST)
చాలా మంది భోజనం తర్వాత నడుస్తున్నారు. పగలు లేదా రాత్రి సమయాలలో భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కొద్దిసేపు నడుస్తుంటారు. ఇలా చేయడం ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు హాని కలుగుతుందా లేదా ఆరోగ్యంగా ఉంటారా అనే విషయాన్ని పరిశీలిస్తే... 
 
సాధారణంగా రాత్రి వేళల్లో భోజనం చేశాక నిద్రకు ఉపక్రమించడం మంచిది కాదని, అందువల్లే కొద్దిసేపు నడవాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. అయితే, డయాబెటిక్ రోగులు ఇలా వాకింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయట. 
 
ఇదే అంశంపై టైప్‌-2 డయాబెటిక్‌ పేషెంట్లపై వైద్య శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇందుకోసం కొంతమంది చక్కెర వ్యాధిగ్రస్తులను రెండు గ్రూపులుగా విభజించారు. వీరిలో ఓ గ్రూపు వారిని భోజనం తర్వాత కొంతసేపు నడవమన్నారు. మరొక గ్రూపు వారిని నడవద్దన్నారు. కొన్నిరోజుల అనంతరం వీరిని పరిశీలించగా, భోజనం చేసిన తర్వాత నడిచిన వారిలో 22 శాతం బ్లడ్‌ షుగర్‌ స్థాయి తగ్గినట్టు గుర్తించారు.
 
సాధారణంగా షుగర్‌ వ్యాధిగ్రస్తుల్లో కనిపించే అధికబరువు కూడా తగ్గిన విషయాన్ని గమనించారు. నడవనివారిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. షుగర్‌ వ్యాధిగ్రస్థులు భోజనం తర్వాత నడవడం అన్నది మంచిదేనని పరిశోధకులు అంటున్నారు. అయితే, ఈ తరహా రోగులు వైద్యుల సలహా తీసుకోవడం ఎందుకైనా మంచిదని సూచన చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణులు, ఒక్క కుక్క కనబడితే ఒట్టు

టీలో నిద్రమాత్రలు కలిపి భార్యకు ఇచ్చి భర్త అత్యాచారం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది టిబి రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం

కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా కామెంట్స్- ఫైర్ అయిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్‌ సిద్ధం

నవీన్ చంద్ర తన భార్యను టార్చెర్ పెడుతున్నాడంటూ కాలనీవాసుల ఫిర్యాదు !

వన్ లైఫ్ వన్ బ్రీత్ వన్ జంప్ - స్కై డైవింగ్ చేసిన భాగ్యశ్రీ బోర్సే

తర్వాతి కథనం
Show comments