Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారం అందుకు పనికిరాదట..?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (11:49 IST)
ఆహారంలో శాకాహారం ఉత్తమం అంటున్నారు వైద్యులు. శాకాహారం తీసుకుంటే అధిక రక్తపోటునుండి కూడా మనిషి తననిన తాను కాపాడుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. పౌష్టికాహారమే శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా వుంచుతుంది. భోజనంలో శరీరానికి కావలసిన ఖనిజ పదార్థాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లతోపాటు పోషకపదార్థాలుండాలి. 
 
సమపాళ్ళలో తీసుకునే శాకాహారం శరీరానికి అన్నిరకాల పోషకాలను అందిస్తుంది. దీంతో గుండెజబ్బులు, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు ఇతర జబ్బులనుండి కూడా బయటపడగలుగుతామని వైద్యులు చెప్తున్నారు. 
 
మాంసాహారం అధికంగా తీసుకునేవారిలో అధిక రక్తపోటును నివారించే అమినో ఆమ్లాలుండవు. అదే శాకాహారంలో అమినో ఆమ్లాలు అధికంగా వుంటాయి. ఈ అమినో ఆమ్లాలు రక్తపోటును నివారిస్తాయి. కాయగూరల్లో అమినో ఆమ్లంతోబాటు మెగ్నీషియం కూడా వుంటుందని ఇది రక్తపోటును క్రమబద్దీకరిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇంతేకాకుండా మాంసాహారుల్లో ఫైబర్ శాతం కూడా తక్కువగా వుంటుందని ఇప్పటికే నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. 
 
ఫైబర్ మనకు ధాన్యాలలో అధికంగా లభిస్తుంది. పప్పులు, పండ్ల రసాలు, ఫ్రూట్ సలాడ్‌లలో అధికంగా లభిస్తుంది. ఇవి శరీర బరువును కూడా క్రమబద్ధీకరిస్తాయి. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం పెరిగిపోతుం. కొవ్వుకూడా అధికంగా పేరుకు పోతుంది. ముఖ్యంగా శరీరానికి కార్బోహైడ్రేట్‌లు కూడా ఎంతో అవసరం. మాంసాహారంలో కార్బోహైడ్రేట్‌లు వుండవు. ఇది బ్రెడ్, రొట్టెలు, అరటిపండు, బంగాళాదుంపల్లో ఎక్కువగా దొరుకుతుంది.  
 
శరీరంలో రక్తం వృద్ధికి మాంసాహారం పనికిరాదు. శరీరంలో రక్త శాతం పెరగాలంటే ఆకుకూరలు, పుదీనా, బెల్లం తదితరాలు తీసుకోవాల్సివుంటుంది. మాంసాహారం నుంచి లభించని బలం పుష్టికరమైన శాఖాహారం నుండి లభిస్తుంది. మాంసాహారం అధికంగా తీసుకుంటే ఆవేశం, ఒత్తిడి తప్పవు. అందుకే శాకాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని.. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చిన వారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

తర్వాతి కథనం
Show comments