Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

సిహెచ్
బుధవారం, 10 సెప్టెంబరు 2025 (22:20 IST)
కరోనరీ ఆర్టరీ డిసీజ్(సీఏడీ)ని తరచుగా పురుషులను ఎక్కువగా ప్రభావితం చేసే పరిస్థితిగా భావిస్తారు. వాస్తవానికి, స్త్రీలు కూడా అంతే హాని అవకాశాలను కలిగి ఉంటారు. వారు కూడా తరచుగా ఆంజినా అంటే- గుండెకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల వచ్చే ఛాతీ నొప్పి వంటి లక్షణాలను అనుభవిస్తారు. అయినప్పటికీ, మహిళల్లో ఇప్పటికీ దీన్ని చాలా తక్కువగానే నిర్ధారణ చేస్తున్నారు. ఈ కారణంగా చాలా తక్కువగానే మహిళలు దీనికి చికిత్స పొందుతున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం ఆంజినాపై అవగాహన లేకపోవడం.
 
భారతదేశంలో సీఏడీ అనేది మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటిగా ఉంది. మరణాల రేటు ప్రపంచ సగటు కంటే 20-50% ఎక్కువ. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకారం, 2022లో భారతదేశంలో 4.77 మిలియన్లకు పైగా మరణాలు సీఏడీ వల్ల సంభవించాయి. ఈ గణాంకాలు ముఖ్యంగా మహిళలకు ఎక్కువ అవగాహన, చురుకైన ఆరోగ్య సంరక్షణ జోక్యాల తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.
 
తీవ్రమైన గుండె సంబంధిత సంఘటనల ప్రమాదాన్ని తగ్గించడానికి, రోగులకు- ముఖ్యంగా గుండె సంబంధ సంరక్షణలో తరచుగా నిర్లక్ష్యానికి గురయ్యే   మహిళలకు- దీర్ఘకాలిక ఫలితాలను మెరుగుపరచడానికి, ఆంజినా ముందస్తు గుర్తింపు, సమర్థవంతమైన నిర్వహణ గురించి అవగాహన పెంచడం అత్యవసరం.
 
ఛాతీ నొప్పి, ఒత్తిడి, బరువు లేదా పిండి వేసే అనుభూతి వంటి లక్షణాలతో కూడిన ఆంజినా- సీఏడీ అత్యంత సాధారణ లక్షణం. ఇది రోగి జీవన నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తుంది. మహిళలు తరచుగా ఆంజినా విలక్షణమైన లక్షణాలను కలిగి ఉంటారు. దవడ లేదా మెడ నొప్పి, అలసట, ఛాతీ వెలుపల అసౌకర్యం వంటివి. ఇది సకాలంలో, కచ్చితమైన రోగ నిర్ధారణను మరింత సవాలుగా చేస్తుంది. దీని ఫలితంగా వైద్యులు అంతర్లీన ఆంజినా కారణాలను పరిష్కరించకుండా ఆయా లక్షణాల ఉపశమన పరిష్కారాలను అందించవచ్చు. రోగులు తమ లక్షణాల ఉనికిని విస్మరించినప్పుడు ఇది మరింత తీవ్రమవుతుంది.
 
అబాట్ ఇండియా మెడికల్ అఫైర్స్ హెడ్ డాక్టర్ రోహిత శెట్టి ఇలా అన్నారు. ఇటీవలి కాలంలో, పెరిగిన పరిశోధనలు సీఏడీపై లింగ ప్రభావం గురించి మన అవగాహనను మరింతగా పెంచాయి. సకాలంలో గుండె సంరక్షణ పొందడంలో మహిళలు తరచుగా, చికిత్స పొందడంలో జాప్యం వంటి ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఇది అధిక ప్రమాదాలకు దారితీస్తుంది. ఈ సవాళ్లను పరిష్కరించడానికి, ఆంజినా నిర్ధారణ, నిర్వహణను మెరుగుపరచడానికి, అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా(ఏపీఐ) సహకారంతో ఓపీటీఏ(ఆప్టిమల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆంజినా) సాధనాలను అబాట్ ప్రవేశపెట్టింది. ఆంజినాతో బాధపడేవారికి మెరుగైన సంరక్షణ, మెరుగైన ఫలితాలను నిర్ధారించడానికి ఇది రూపొందించబడింది.
 
ఓపీటీఏ క్లినికల్ చెక్‌లిస్ట్, ఓపీటీఏ ప్రశ్నాపత్రం, ఓపీటీఏ విధానంతో సహా మూడు ప్రత్యేకమైన సాధనాలు వరుసగా ఆంజినా నిర్ధారణ, రోగ నిర్ధారణ, వైద్య నిర్వహణకు మద్దతు ఇస్తాయి. క్లినికల్ ప్రాక్టీస్‌లో ఓపీటీఏ సాధనాలను ఏపీఐ సిఫార్సుచేయడంతో, ఇది ఆరోగ్య సంరక్షణ నిపుణులకు సకాలంలో రోగ నిర్ధారణ చేయడంలో సహాయపడుతుంది. ఇది ఆంజినా ఉత్తమ నిర్వహణ వైపు మొదటి అడుగు.
 
డాక్టర్ సరితా రావు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్-డైరెక్టర్ క్యాత్ ల్యాబ్, అపోలో హాస్పిటల్స్, ఇందౌర్, మహిళల్లో గుండె జబ్బులను గుర్తించడంలో ఒక ప్రధాన సవాలు ఏమిటంటే, వారు సహజంగా తక్కువ ప్రమాదంలో ఉన్నారనే సాధారణ అపోహ. సీఏడీ వంటి గుండె జబ్బులు తరచుగా పురుషుల కంటే ఒక దశాబ్దం ఆలస్యంగా సంభవిస్తాయనేది నిజమే అయినప్పటికీ, ఈ ఆలస్యం అంటే మహిళలకు అది రాదని కాదు. గుండె జబ్బుల ప్రమాదాల గురించి మహిళలకు అవగాహన కల్పించడం, ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడంలో వారికి సహాయపడటం పెద్ద తేడాను కలిగిస్తుంది. అందుకే జీవనశైలి మార్పులు, సకాలంలో వైద్య సంరక్షణ ప్రాముఖ్యత గురించి మహిళలకు జ్ఞానం ఇవ్వడం చాలా ముఖ్యం.
 
75 ఏళ్ల తర్వాత, హృదయ సంబంధ వ్యాధులు(సీవీడీ) ఉన్న రోగులలో ఎక్కువ మంది మహిళలే. ఆంజినాతో బలంగా ముడిపడి ఉన్న ఊబకాయం వంటి పరిస్థితులు పురుషులతో పోలిస్తే ఎక్కువమంది మహిళలను ప్రభావితం చేస్తాయి. పురుషుల కంటే మహిళలు 50% ఎక్కువగా రోగ నిర్ధారణ చేయబడరు. దాంతో బాగా కోలుకునేందుకు అవసరమైన సకాలంలో చికిత్స వారికి అందకుండా పోతుంది.
 
సరైన, సకాలంలో వైద్య చికిత్స అనేది వ్యాధి పురోగతిని నెమ్మదింపచేస్తుంది. లక్షణాలను తగ్గిస్తుంది. జీవన నాణ్యతను పెంచుతుంది. భారతదేశం గుండె సంబంధ వ్యాధుల పెరుగుతున్న భారాన్ని ఎదుర్కొంటున్నందున, రోగ నిర్ధారణ, చికిత్స, వ్యాధి నిర్వహణలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడం చాలా ముఖ్యం. ముందస్తుగా గుర్తించడం, సరైన అవగాహనతో మహిళలకు సాధికారత కల్పించడం ప్రస్తుత ధోరణులను తిప్పికొట్టడానికి, ఫలితాలను మెరుగుపరచడానికి కీలకం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వివేకానంద రెడ్డి హత్య కేసు- హంతకుడిని గుర్తించకుండానే దర్యాప్తు పూర్తయ్యిందా?

నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయం పనులు- రూ.916 కోట్లు ఆమోదం

సిద్ధం సిద్ధం.. అని అప్పుడు అరిచారు.. ఇప్పుడు రప్పా రప్పా అంటే ఊరుకుంటామా?

Super Six: వైకాపా పాలనను ధృతరాష్ట్ర కౌగిలిగా అభివర్ణించిన ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాదులో రూ.13.9 కోట్ల విలువైన 13.9 కిలోల హైడ్రోపోనిక్ పట్టివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Sequel: కాంతారా చాప్టర్ వన్‌కు కేరళతో వచ్చిన కష్టాలు.. సమస్య పరిష్కరించకపోతే..?

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

తర్వాతి కథనం
Show comments