Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెదళ్ళలో చిప్‌లు అమర్చి మా మనసులు నియంత్రిస్తున్నారు.. బెంగుళూరు టెక్కీలకు 'పారనోయా' రుగ్మత

సైన్స్ ఫిక్షన్ కథలలో చెప్పుకున్న 'పారనోయా' (భయం లేదా ఆందోళన వల్ల కలిగే మానసిక మార్పు) బెంగళూరు ఐటీ కంపెనీలను తాకింది. తమ మనసులను యూఎస్ నుంచి నియంత్రిస్తున్నారని, తమిళనాడు పోలీసులు తమను కంట్రోల్ చేస్తు

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2016 (13:42 IST)
సైన్స్ ఫిక్షన్ కథలలో చెప్పుకున్న 'పారనోయా' (భయం లేదా ఆందోళన వల్ల కలిగే మానసిక మార్పు) బెంగళూరు ఐటీ కంపెనీలను తాకింది. తమ మనసులను యూఎస్ నుంచి నియంత్రిస్తున్నారని, తమిళనాడు పోలీసులు తమను కంట్రోల్ చేస్తున్నారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు టెక్కీల నుంచి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోంది. భారత్‌కు సైబర్ రాజధానిగా పేరున్న బెంగళూరును ఇప్పుడు భయపెడుతున్నది ఈ పారనోయానే. ఈ మానసిక రుగ్మత వివరాలను పరిశీలిస్తే... 
 
కొన్ని వారాల క్రితం శ్రీరేఖ (పేరు మార్పు) అనే ఐటీ ఉద్యోగిని మానవ హక్కుల సంఘానికి వచ్చి యూఎస్ ఫెడరల్ పోలీసులు తన మెదడును నియంత్రిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. "మొదటిసారి ఆమె మా దగ్గరకు వచ్చినప్పుడు, తన మాజీ భర్త యూఎస్‍‌లో ఉన్నాడని తెలిపింది. ఫెడరల్ పోలీసులు తన ఆలోచనలను నియంత్రిస్తున్నారని తెలిపింది. మేము ఆమెకు ఏవైనా ఆస్తి వివాదాలు, చిన్నారుల కస్టడీ వివాదాలు ఉన్నాయా? అని విచారించాం. అవేమీ లేవని తేలింది. తనను మరో ప్రాంతం నుంచి ఎవరో కంట్రోల్ చేస్తున్నారన్నది ఆమె భయం. ఇటీవలి కాలంలో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి" అని కర్ణాటక మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ మీరా సక్సేనా వెల్లడించారు. 
 
మరో కేసులో భారత సూపర్ కాప్‌గా గుర్తింపు తెచ్చుకున్న కేపీఎస్ గిల్, తన మెదడులో ఓ చిప్‌ను అమర్చి తనను నియంత్రిస్తున్నట్టు పీ రాకేష్ (పేరు మార్చాం) అనే యువకుడు ఫిర్యాదు చేశారు. తన బ్రెయిన్‌ను ఆయన చాలా రోజులుగా కంట్రోల్ చేస్తున్నాడన్నది ఆయన ఆరోపణ. ఇక మరో కేసులో ఇంకో మహిళ వచ్చి తమిళనాడు పోలీసులు తన మనసులోకి ప్రవేశించినట్టు ఫిర్యాదు చేశారు. ఈ కేసులు తమ పరిధిని దాటి ఉండటంతో నిమ్హాస్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్) సహాయాన్ని కోరామని సక్సేనా తెలిపారు. 
 
దీనిపై ప్రముఖ సైకియాట్రిస్ట్ జీకే కన్నన్ స్పందిస్తూ... "ఇది ఓ రుగ్మతగానే భావిస్తున్నాం. అయితే కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో పనిచేస్తున్న వారు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కేవలం కొన్ని విషయాలను మాత్రమే నిత్యమూ చర్చిస్తుండే వారిలో పారనోయా సమస్య పెరుగుతోంది. కుటుంబంలోని వారిలో మానసిక సమస్యలు ఉన్నా కూడా కొందరు ఇలా ప్రవర్తించవచ్చు" అని చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

మద్యం మత్తులో రెచ్చిపోయిన పోకిరీలు ... బస్సును వెంబడిస్తూ అసభ్యకర చేష్టలు (Video)

కీలక ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది.. అందుకే తలొగ్గాం : పాక్ ఉప ప్రధాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

తర్వాతి కథనం
Show comments