అరటిపండును రాత్రిపూట తినకూడదట?

పొటాషియం పుష్కలంగా వుండే అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుం

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (10:46 IST)
పొటాషియం పుష్కలంగా వుండే అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. అల్సర్‌కు చెక్ పెట్టే అరటి పండును భోజనం తర్వాత తీసుకోవడం చాలా మంచిది. 
 
కానీ, రాత్రి భోజనం తర్వాత మాత్రం తీసుకోవద్దునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే..? ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడడానికి, జలుబుకు దారితీస్తుంది. అందుకే అరటిని రాత్రిపూట తీసుకోకూడదని వారు సూచిస్తున్నారు. అరటి పండు మధ్యాహ్నం పూట తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని.. అలాగే పరగడుపున అరటి పండును తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహాలిస్తున్నారు.  
 
అలాగే ఆపిల్ పండును కూడా రాత్రిపూట తీసుకోకూడదు. యాపిల్‌లో వుండే యాసిడ్స్ కడుపులో ఆమ్ల స్థాయిల్ని పెంచుతాయి. అంతేకాకుండా ఆపిల్‌లో వుండే పెక్టిన్ అనే ఫైబర్ జీర్ణ వ్యవస్థపై భారం పడేలా చేస్తుంది. 
 
పెక్టిన్ కారణంగా అసిడిటీ ఏర్పడుతుంది. అందుకే ఆపిల్‌ను అల్పాహారంతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని.. తద్వారా అధిక బరువు సమస్య వుండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఆపిల్‌లోని పెక్టిన్ చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments