Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచే సీజనల్ ఫ్రూట్స్ ఏమిటి?

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2015 (15:44 IST)
సాధారణంగా వర్షాకాలం లేదా చలికాలం వచ్చిందంటే అనేక అనారోగ్య సమస్యలు వెన్నంటి ఉంటాయి. అందుకే ఈ రెండు కాలాల్లో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తతో ఉండాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఫ్రూట్స్‌ను తప్పనిసరిగా ఆరగించాల్సి ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల డయేరియాలాంటి ఎన్నో శరీర బాధలను తగ్గించి, జీర్ణక్రియ సక్రమంగా ఉండేలా చేస్తాయని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
ఈ కాలంలో సీజనల్‌గా లభించే ఫ్రూట్స్‌ తినడం ఆరోగ్యానికి ఎంతోమేలు. ఈ సీజన్‌లో లభించే లిచి, ప్లమ్‌, చెర్రీ, పీచ్‌, జమున్‌లాంటి ఫ్రూట్స్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యపరంగా వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. లిచి పండు తింటే వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను తప్పించుకోవచ్చు. పైగా అవి మనలో రోగనిరోధకశక్తిని కూడా పెంపొందిస్తాయి. అంతేకాదు వీటి వల్ల శరీర బరువు కూడా తగ్గుతుంది. 
 
ఫ్లూ కారకాలైన ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ప్లమ్‌ ఫ్రూట్‌ బాగా పనిచేస్తుంది. ఈ ఫ్రూట్స్‌లో పీచుపదార్థాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. జమున్‌ ఫ్రూట్స్‌లో కాలరీలు తక్కువగా ఉంటాయి. మధుమేహంతో బాధపడేవారికి ఈ పండు చాలా మంచిది. డయేరియా, ఆర్థరైటిస్‌ లాంటి జబ్బులతో బాధపడేవారు వీటిని తింటే ఎంతో మంచిది. పీచ్‌ పండు తేమ వాతావరణంలో చర్మం దెబ్బతినకుండా కాపాడడమే కాదు మనలో రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments