Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో వుంచుతున్నారా? వాటిని వేడిచేసి తింటే వీర్యలోపం?

ఫ్రిజ్‌లో వుంచిన ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటున్నారా? అయితే వీర్యలోపం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారి ఉడికించిన పొటాటో, బీట్‌రూట్‌లను ఫ్రిజ్‌లో వుంచి తిరిగి వేడి చేసి తీస

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (13:38 IST)
ఫ్రిజ్‌లో వుంచిన ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటున్నారా? అయితే వీర్యలోపం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారి ఉడికించిన పొటాటో, బీట్‌రూట్‌లను ఫ్రిజ్‌లో వుంచి తిరిగి వేడి చేసి తీసుకుంటే వీర్యలోపం తప్పదని వారు అంటున్నారు. ఇదే విధంగా ఐరన్, నైట్రేట్లు అధికంగా గల ఆకుకూరలను వండిన తర్వాత ఫ్రిజ్‌లో వుంచకూడదు. ఆకుకూరలను వండిన వెంటనే తినేయాలి. 
 
ఫ్రిజ్‌లో వుంచి తీసుకుంటే మాత్రం క్యాన్సర్ ఏర్పడే ఛాన్సులున్నాయి. ఇదే విధంగా కోడిగుడ్లను ఫ్రిజ్ నుంచి తీశాక మళ్లీ వేడి చేసి తీసుకోకూడదు. కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు వంటి పదార్థాలు ఫ్రిజ్ లోపెట్టొచ్చుకానీ.. వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టకపోవడం మంచిది. వండే ఆహారాన్ని మిగిలిపోకుండా చేసుకోవడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉడికించిన ఆహారాన్ని వేడి చేసి తీసుకోవడం ద్వారా పేగులకు దెబ్బేనని తద్వారా అజీర్తి సమస్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.
 
అలాగే పాలు, కోడిగుడ్లు మాంసాన్ని ఫ్రిజ్‌లో వుంచితే వారానికి ఓసారైనా శుభ్రం చేయాలి. అలా చేయని పక్షంలో బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంది. ఆ బ్యాక్టీరియా డయేరియాకి కారణమవుతుంది. ఫ్రిజ్‌లో వుంచిన ఆహార పదార్థాలను పిల్లలకు ఇవ్వకపోవడం చాలా మంచిది. 
 
మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో వుంచకపోవడం మంచిది. శుభ్రం చేసి ఫ్రిజ్‌లో పెట్టి, వండిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మితంగా తెచ్చుకుని ఆ పూటకు ఆ పూట తినేయడం మంచిదని.. మిగిలించి.. ఫ్రిజ్‌లో పెట్టి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనం వుండదని వారు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments