Webdunia - Bharat's app for daily news and videos

Install App

దానిమ్మ పువ్వులో నమిలి తిని.. అర గ్లాసుడు పాలు సేవిస్తే?

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (14:57 IST)
దానిమ్మ పండులో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. అలాగే దానిమ్మ పువ్వులోనూ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే ఔషధాలున్నాయి. దగ్గు, జలుబు, ఆయాసం వంటి రుగ్మతలను తొలగించుకునేందుకు దానిమ్మ పువ్వులు మెరుగ్గా పనిచేస్తాయి. రోజు ఉదయం నాలుగు దానిమ్మ పువ్వులను నమిలి తిని.. ఆపై అర గ్లాసుడు పాలు సేవిస్తే రక్తం శుద్ధి అవుతుంది. 
 
దానిమ్మ పువ్వులను పాలలో ఉడికించి.. ఆ నీటిని వడగట్టి అందులో తేనె కలిపి తీసుకుంటే నరాలకు బలం చేకూరుతుంది. దానిమ్మ పువ్వుల రసం 300 గ్రాములు, ఆవు నెయ్యి 200 గ్రాములు చేర్చి కాచి.. ఆరిన తర్వాత సీసాలో భద్రపరుచుకుని.. ఉదయం, సాయంత్రం తీసుకుంటే శరీరానికి బలాన్నిస్తుంది. 
 
దానిమ్మ పువ్వులను సేకరించే నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉదయం, సాయంత్రం పూట ఒక టేబుల్ స్పూన్, తేనెను కలిపి తీసుకుంటే పైల్స్‌కు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

తర్వాతి కథనం
Show comments