Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌లో వున్నారుగా.. పిల్లలకు పిస్తా పెట్టండి..

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (13:23 IST)
లాక్ డౌన్‌లో వున్న ప్రజలంతా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వైద్యులు చెప్తున్నారు. ఏవి పడితే అవి తినకుండా పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా వుండవచ్చునని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు పోషకాహారం ఇవ్వాలని న్యూట్రీషియన్లు చెప్తున్నారు. అలాంటి పోషకాహారం జాబితాలో నట్స్‌ను చేర్చవచ్చు. 
 
నట్స్‌లో పిస్తా పప్పులు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారిలో జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఇందులో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తరచుగా పిస్తీలను తీసుకోవడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఇందులో ఉండే పిండి పదార్ధాలు ఒబిసిటీని దూరం చేస్తాయి. 
 
సాధారణంగా నట్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది..కానీ పిస్తాలో ఆ సమస్య లేదు. ఎక్కువగా తిన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. పిస్తా పప్పులను షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకుంటూ ఆరోగ్యానికి మంచి చేస్తుంది. పిస్తాలు శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి గ్లూకోజ్ స్తాయిలను తగ్గిస్తాయని వైద్యులు చెప్తున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా పిస్తా పప్పులు తీసుకోవచ్చు. 
 
పిస్తాలోని విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను చక్కగా పని చేసేలా చేస్తాయి. ఇవి శరీరంలో సక్రమంగా సరైన రక్త సరఫరాకు ఇవి సహాయపడతాయి. పిస్తాలో ఉండే విటమిన్ ఇ చర్మంలో త్వరగా వృధ్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments