Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుమ్ముతో జడుసుకుంటున్న జనం... పక్క మనిషి దగ్గినా భయమే...

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (11:55 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం అతలాకుతలమైపోయింది. ప్రతి ఒక్కరి జీవితాలు తారుమారైపోయాయి. కరోనా ముందు ఎలాంటి భయం లేకుండా సాఫీగా సాగిన జీవన ప్రయాణం ఇపుడు బిక్కు బిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా, ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందన్న ప్రచారం ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. దీనికితోడు చలికాలం కావడంతో మరింతగా వణికిపోతున్నారు. అందుకే పక్కమనిషి ఎవరైనా తుమ్మితే జడుసుకుంటున్నారు. దగ్గినా భయపడుతున్నారు. 
 
సాధారణంగా చలికాలంలో సంక్రమించే సీజనల్‌ వ్యాధులు, కరోనా లక్షణాలను పోలి ఉండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఫ్రెండ్స్‌, రిలేటివ్స్‌‌లో ఎవరికైనా జలుబు లక్షణాలు కనిపిస్తే చాలు ఆందోళన చెందుతున్నారు. వీరితో మాట్లాడేందుకే సంకోచిస్తున్నారు. కరోనా లక్షణాల్లో దగ్గు, జలుబుతో పాటు తలనొప్పి, జ్వరం కూడా ఉన్నాయి. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారు. 
 
చలికాలానికితోడు వరుస పండుగలు, ఫంక్షన్లు ఉండటంతో సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెవ్‌ పట్ల అటు కేంద్రంతో పాటు.. ఇటు రాష్ట్రాలు కూడా హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలో సీజనల్‌ వ్యాధులు సోకినంత మాత్రాన కరోనా వచ్చినట్లు భావించొద్దని వైద్యులు చెబుతున్నారు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పగటి పూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రావాల్సిన ఉత్తరగాలులు కూడా ఇప్పుడే వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. ఉదయం 10 గంటల వరకు వాతావరణం చలిగానే ఉంటుంది. తిరిగి సాయంత్రం నాలుగైదు గంటల నుంచే చలిగాలులు వీస్తుండడంతో పాటు, చలి తీవ్రత పెరుగుతోంది. 
 
దీంతో చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిలో జలుబు, దగ్గు లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. వీటి వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోయినప్పటికీ, శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని చెప్తున్నారు. పరిస్థితి అదుపుతప్పి ప్రాణాల మీదకు వచ్చేంత వరకు చూడొద్దని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైన్ స్నాచింగ్ అలా నేర్చుకున్న వ్యక్తి అరెస్ట్- రూ.20లక్షల విలువైన బంగారం స్వాధీనం

మహిళా కౌన్సిలర్ కాళ్ల మీద పడ్డాడు... నడుముపై అసభ్యంగా చేయి వేశాడే? (video)

Pawan kalyan: సెప్టెంబర్ 5న అరకులో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Amaravati: అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని- మంత్రి నారాయణ

గతుకుల రోడ్డుకి ఎంత ఫైన్ కడతారు?: ద్విచక్ర వాహనదారుడు డిమాండ్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

తర్వాతి కథనం
Show comments