Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట అధికంగా తినేస్తే ఏమవుతుందో తెలుసా?

శరీర శ్రమ పూర్తిగా తగ్గిపోయిన ఈ కాలంలో ముప్పూటలా ఫుల్లుగా తింటే ముప్పేనంటున్నారు. టెక్నీషియన్లు... ప్రత్యేకించి రాత్రివేళ అతిగా తినేసే అలవాటు స్థూలకాయం రావడానికి, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు తలెత్తడానికి కారణం అవుతుందని చెపుతున్నారు. ఆరోగ్య శాస్త్

Webdunia
శనివారం, 6 మే 2017 (19:42 IST)
శరీర శ్రమ పూర్తిగా తగ్గిపోయిన ఈ కాలంలో ముప్పూటలా ఫుల్లుగా తింటే ముప్పేనంటున్నారు. టెక్నీషియన్లు... ప్రత్యేకించి రాత్రివేళ అతిగా తినేసే అలవాటు స్థూలకాయం రావడానికి, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు తలెత్తడానికి కారణం అవుతుందని చెపుతున్నారు. ఆరోగ్య శాస్త్రం ప్రకారం, ఉదయం తిన్న ఆహారం మోతాదులో సగం మధ్యాహ్నం, ఇందలో సగం రాత్రివేళ తినాలి. ఎందుకంటే సూర్య గమనానికి జీర్ణశక్తికీ సంబంధం వుంది. సూర్యోదయం వేళ వుండే జీర్ణశక్తిలో 60 శాతమే రాత్రివేళ వుంటుంది. 
 
భోజనం మోతాదు కూడా అదే నిష్పత్తిలో తగ్గుతూ రావాలి. కానీ, ఉద్యోగ వ్యాపారాల ఒత్తిళ్లు కారణంగా ఉదయం, మధ్యాహ్నం హడావుడిగా తినేస్తారు. రాత్రివేళ ఆ ఒత్తిళ్లు పెద్దగా ఉండకపోవడం వల్ల మనసు కూడా కుదురుగా ఉండి ఎక్కువగా తినేస్తుంటారు. ఏక భుక్తం యోగి, ద్విభక్తం భోగి, త్రిభుక్తం రోగి అన్న ఆరోగ్య సూత్రం ఒకటి వుంటుంది. 
 
వ్యాయామాలు, శరీర శ్రమ అసలే లేకుండా పోయిన ఈ దశలో ఉదయం, మధ్యాహ్నం చేసిన భోజనాల్లోని కేలరీలే శరీర పోషణకు సరిపోతాయి. అయినా అంతటితో ఆగక మూడోసారి కూడా తినేసిన తాలూకు కేలరీలు శరీరంలో అదనంగా ఉండిపోతాయి. అందుకో భోజనానంతరం తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే కేలరీలు లేని కీర దోస లాంటివి లేదా అతి తక్కువ కేలరీలున్న ఆహార పదార్థాలుగానీ తీసుకోవడం మేలు. డిన్నర్ లో తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువ పీచు పదార్థం తక్కువ క్యాలరీలతో వుండేలా చూసుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

భార్యతో శృంగారానికి ఆన్‌లైన్ ఆఫర్ చేసిన భర్త...

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

నటి రమ్యశ్రీపై దాడి... పోలీసులకు ఫిర్యాదు.. దాడిచేసింది ఎవరంటే...

Chevireddy: దేశం విడిచి పారిపోయేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యత్నం... అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

తర్వాతి కథనం
Show comments