Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలాంటి స్నానం చేస్తున్నారా లేదా..? చేస్తే ఏమవుతుంది?

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (22:34 IST)
శరీరానికి నూనెతో మర్థనా గావించి, తరువాత స్నానము చేయుట చాలా మంచిది. దీనివలన సర్వాంగాలకు పుష్టి కలుగును. ఆవనూనె, గంధపుచెక్కల నుండి తీసిన నూనె, సుగంధ ద్రవ్యముల నుండి తీసిన నూనెలు, పుష్పములు నుండి లభించు నూనెలను అభ్యంగనానికి ఉపయోగించవచ్చును.
 
అభ్యంగనమువలన- వాత, కఫ దోషములు హరించును. శారీరక బడలికను పోగొట్టి- బలాన్ని కలిగిస్తుంది. దేహకాంతి, మంచి కంటిచూపు, సుఖనిద్రను కలిగిస్తుంది. ఆయుష్షును వృద్ధిచేస్తుంది.
 
ప్రతిరోజూ చెవులలో కొద్దిగా తైలపుచుక్కలు వేసుకోవడం వలన చెవులలోని మాలిన్యములు తొలగిపోతాయి. శబ్ధగ్రహణము బాగుంటుంది. చెవిపోటు, ఇతర సమస్యలు, వ్యాధులు రాకుండా వుంటాయి.
 
ప్రతిరోజూ పాదములకు తైలముతో మర్థనా చేయుటవలన పాదములలో బలము వృద్ధిచెందుతుంది. మొద్దుబారిన పాదాలు స్పర్శా జ్ఞానములను సంతరించుకుంటాయి. పాదములు మీద పగుళ్ళను పోగొడతాయి. దీనివలన నేత్రములకు కూడా చలువచేస్తుంది. కళ్ళు ప్రకాశవంతమవుతాయి. సుఖనిద్రకలుగుతుంది.
 
శిరస్సు మీద నూనె మర్దనాచేయుట వలన-మెదడు శక్తివంతమవుతుంది. కళ్ళు-చెవులు, దంతములకు ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. శరీరాభ్యంగము వలన-తైలము రోమకూపములలో నుండి లోనికి ప్రవేశించి నరములు, రక్తనాళములలో ఎంతో చురుకుదనాన్ని కలిగిస్తుంది. ధాతువులను వృద్ధిచేస్తుంది.
 
వివిధ రకములు జ్వరములతో బాధపడేవారు, అజీర్ణవ్యాధులతో బాధపడేవారు, విరేచనములగుటకు ఔషదము తీసుకొన్నవారు తైలముతో అభ్యంగము చేయకూడదు. శరీరానికి తైలముతోపాటు...నలుగుపిండిని పూసి, బాగా మర్దనాచేస్తూ పొట్టుగా శరీరమునుండి రాలిపోవునంత వరకూ చేసి-స్నానము చేసిన, కఫమును పోగొడుతుంది. బలాన్ని వృద్ధిచేస్తుంది. రక్తం శుద్ది అవుతుంది. చర్మం మృదువుగా వుంటుంది. నేత్రములకు చలువచేసి కాంతివంతమవుతాయి. ముఖ వర్చస్సు పెరుగుతుంది.
 
స్నానం ద్వారా శరీరమును శుభ్రపరచుకొనుట వలన-శరీరము మీద మాలిన్యములు తొలగిపోతాయి. దురదలు, మంటలు వుండవు అలసట పోయి ఉత్సాహము కలుగుతుంది. కునికిపాట్లు, బద్దకం నశిస్తాయి తప్పి, తాపము తగ్గుతాయి. శరీరానికి బలమును కలిగిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

తర్వాతి కథనం
Show comments