Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో వ్యాయామం చేయడం మంచిదా..?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (09:43 IST)
వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు తాళలేక, వేడికి తట్టుకోలేక ఆరోగ్యం దెబ్బతినిపోతోంది. వడదెబ్బకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వేసవి కాలంలో వ్యాయామం ఎక్కువ సమయం చేయొచ్చా.. అలానే ఎలాంటి ఆహారం తీసుకోకూడదో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
ఎండలు విపరీతంగా ఉండే వేసవిలో ఉప్పు, కారం, పులుపు ఎక్కువగా తీసుకోకూడదు. గ్రీష్మరుతువులో అతిగా, అధికంగా వ్యాయామం చేయకూడదు. ఎందుకంటే శరీరం ఆయాసజనం వ్యాయామం అంటారు. మన శరీరానికి శ్రమనిచ్చే వ్యాయామంతో చెమట ఎక్కువగా పడుతుంది. చెమట రూపంలో నీరు మరీ ఎక్కువగా బయటకు పోయినప్పుడు.. శుష్కత్వం, నీరసం వస్తాయి. అందువలన అతిగా వ్యాయామం చేయకూడదు.
 
మద్యం వలన శరీరంలో అంగ శైధిల్యం వచ్చి.. పటుత్వం తగ్గుతుంది. శరీరమంత మంట వస్తుంది. ముఖ్యంగా మోహం, అంటే కళ్లు చీకట్లు కమ్ముతాయి. గ్రీష్మరుతువులో మద్యం ఎక్కువగా తీసుకుంటే ఇన్ని సమస్యలు. కాబట్టి మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 
 
వేసవిలో కొన్నికొన్ని పానీయాలు, సేవనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మజ్జిగ, పాలు, నెయ్యి, కొబ్బరినీళ్లు, చెరకురసం, పెరుగు వంటివి అధికంగా తీసుకోవడం శరీరానికి ఎంతో మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments