శక్తికిమించి పని.. అయినా ఎంజాయ్ చేస్తున్న మహిళలు.. ఎలా?

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (18:55 IST)
"ఆడుతుపాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండదు".. అనే ఈ సినీపాటను ప్రతి ఒక్కరూ వినేవుంటారు. నిజానికి ఇది ఒక సినిమా పాటే కావొచ్చు. కానీ, ఈ పాటలో గొప్ప జీవిత సత్యం దాగివుంది. పనిలో ఎంత ఆనందాన్ని అనుభవించవచ్చో తెలిపారు. అయితే... ఏదైనా అతిగా పోతే ప్రమాదమే. విపరీతంగా పనిచేయడం వల్ల ప్రాణాలకు కూడా అపాయమేనట.
 
నేటి యువతలో ఒక్క రోజులోనే పెద్దవారైపోవాలన్న తపనవుంది. ఇందుకోసం శక్తికిమించి పని చేస్తున్నారు. అయితే, జపాన్‌, చైనా వంటి దేశాల్లో ఇలా అతిగా పనిచేసి ప్రాణాలు కోల్పోయిన యువత ఎందరో ఉన్నారు. 
 
నిజానికి గుడ్డెద్దు చేలో పడినట్టుగా విపరీతంగా పనిచేసుకుపోవడం యువతకు ఏమాత్రం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా పని ఉండటం వల్ల విపరీతమైన శారీరక, మానసిక ఒత్తిడులకి ఉద్యోగులు లోనవుతారని, దీనివల్ల ఎనర్జీ లెవెల్స్‌ అనూహ్యంగా పడిపోయి తీవ్రంగా అనారోగ్యంపాలు చేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. 
 
ఇలా అనారోగ్యం క్షీణిస్తోందని గ్రహించే లోపలే యువత ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. పోటీ ప్రపంచంతోపాటు, సంపాదన, ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను ఎక్కాలనే ఆకాంక్షతో తీవ్రమైన పని ఒత్తిడి బారిన యువతపడుతోంది. పరిస్థితి ఎలా తయారైందంటే ఆఫీసులో గంటల కొద్దీ పనిచేసేవారే కెరీర్‌పట్ల సీరియ్‌సగా ఉంటారనే అభిప్రాయం చాలామందిలో నాటుకుపోయింది. 
 
కానీ అన్నేసి గంటలు పనిచేయడం వల్ల వారి ప్రాణాలకు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఎవ్వరూ గుర్తించడంలేదని వారు చెబుతున్నారు. అయితే, అతిగా పని చేసేవారు పని ఒత్తిడి బారినపడుకుండా ఉండాలంటే నీళ్లు బాగా తాగుతుండాలి. పని మధ్యలో బ్రేక్‌ తీసుకుంటుండాలి. కాసేపుతోటి ఉద్యోగులతో పిచ్చాపాటి మాటలు మాట్లాడాలి. వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. 
 
ఈ విషయంలో పురుషుల కంటే ఆడవాళ్లు ఒత్తిడిని అధిగమించగలగడానికి కారణం వాళ్లు కొద్దిగా టైం దొరికినా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. కష్టసుఖాలు పంచుకుంటారు. ఎంజాయ్‌ చేస్తారు. ఈ గుణాలు మగవాళ్లల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. 
 
అందుకే శక్తికి మించి పనిచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. వర్కును ఎంజాయ్‌ చేయండి. శరీరానికి కావాల్సినంత విశ్రాంతినివ్వండి. అప్పుడప్పుడు బ్రేక్‌ తీసుకోండి. జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించండి. కొత్త ప్రదేశాలకు వెడుతుండండి. కొత్త మనుషులను కలుస్తుండండి. అప్పుడు మీరు చేసే పని పట్ల మీకు విరక్తి పుట్టదు. పనిలో సమతుల్యత సాధిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియో

బస్సులో జర్నీ చేసిన తమిళనాడు సీఎం విజయ్ (video)

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబు

సినీ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త మృతి.. ఏం జరిగింది?

పోలీసులకు.. ఆర్మీకి మధ్య ఘర్షణ.. 40 మంది సైనికులపై కేసు నమోదు.. ఏం జరుగుతోంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 10 సీజన్‌లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా చిత్రం

పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిని జబర్దస్త్ ఫైమా

తర్వాతి కథనం
Show comments