Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంలో పేరుకుపోతున్న కొవ్వును కరిగించాలంటే...

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (20:13 IST)
ఇప్పుడు ఎక్కువగా కూర్చుని చేసే ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతోంది. మరోవైపు శరీరానికి కావలసిన సరైన వ్యాయామం, పౌష్టికాహారం చాలామంది తీసుకోవడం లేదు. దీంతో శరీరంలో కొవ్వు శాతం అధికంగా పేరుకుపోతోంది. 
 
శరీరంలో పేరుకుపోతున్న కొవ్వును కరిగించాలంటే... రుతువులకు తగ్గట్టు లభించే కూరగాయలు, పండ్లు, పీచుపదార్థాలు కలిగిన ఆహార పదార్థాలను సేవిస్తుండాలి. ముఖ్యంగా క్రమంతప్పకుండా వారానికి ఒకసారి సగ్గు బియ్యం ఉడకబెట్టుకుని అందులో పాలు, చక్కెర కలుపుకుని సేవిస్తే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందంటున్నారు వైద్యులు. 
 
అలాగే తక్కువ చక్కెర కలిగిన ఆహార పదార్థాలను సేవించండి. పాలు, టీ, కాఫీ, తీపి పదార్తాలు తీసుకునేటప్పుడు తక్కువ శాతం చక్కెర ఉండేలా చూసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా చాలామంది పెరుగులో చక్కెర కలుపుకుని తింటుంటారు. ఇలా తింటే వారి ఆరోగ్యానికి చాలా ప్రమామదం. శరీరంలో కొవ్వు శాతం పెరగడమే కాకుండా మధుమేహానికి దారి తీస్తుందంటున్నారు వైద్యులు. 
 
ప్రధానంగా మాంసాహారులైతే మాంసాన్ని సేవించడం తగ్గించండి. దీంతో శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోదు. అలాగే ప్రకృతిపరంగా లభించే ఆహార పదార్థాలను నిత్యం క్రమం తప్పకుండా వాడుతుంటే రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ఆహార నియమాలను పాటించాలి. నియమానుసారం వ్యాయామం చేస్తుండాలి. పీచుపదార్థాలను ఎక్కువగా తీసుకుంటుండాలి. దీంతో శరీరంలోని బరువు, కొవ్వును తగ్గించవచ్చు. క్రమం తప్పకుండా నియమానుసారం వ్యాయామం, భోజనం సరైన మోతాదులో తీసుకుంటుంటే ఎలాంటి మందులు లేకుండానే శరీరంలోని కొవ్వును తగ్గించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సంబంధిత వార్తలు

జూన్ 4న కౌంటింగ్-గేమ్ ఛేంజర్‌గా మారనున్న పోస్టల్ బ్యాలెట్లు..

ఆ బాలిక ఆత్మవిశ్వాసంతో అద్భుత విన్యాసాలు - video

16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?

బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియాలో మృతి

ప్రపంచ జీవన కాలం.. పదేళ్ల పురోగతిని తిప్పికొట్టిన కోవిడ్ మహమ్మారి

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments