Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్స్ అధికంగా వాడితే... కళ్ళు పొడిబారిపోతాయట...

రోజు సుమారు 42 లక్షలకు పైగా స్మార్ట్‌ఫోన్స్ మనం దేశంలో అమ్ముడుపోతున్నాయి. ఈ సంఖ్యను చూస్తుంటే మన దేశంలో మెుబైల్ ఫోన్స్ ఉన్న డిమాండ్ ఏంటో అర్థమవుతుంది. అదే సమయంలో కంట్లో వేసుకునే చుక్కల మందులు కూడా భార

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (16:54 IST)
రోజు సుమారు 42 లక్షలకు పైగా స్మార్ట్‌ఫోన్స్ మనం దేశంలో అమ్ముడుపోతున్నాయి. ఈ సంఖ్యను చూస్తుంటే మన దేశంలో మెుబైల్ ఫోన్స్ ఉన్న డిమాండ్ ఏంటో అర్థమవుతుంది. అదే సమయంలో కంట్లో వేసుకునే చుక్కల మందులు కూడా భారీ సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే 54 శాతం ఈ ముందులు అమ్మకాలు సంఖ్య పెరిగింది.
 
స్మార్ట్‌ఫోన్స్ మన కళ్లలో నీళ్లను ఆవిరి చేస్తుంటాయి. కనుక చాలామంది అధికంగా ఈ కంటి మందులను వాడుతున్నారు. స్మార్ట్‌ఫోన్స్ ప్రపంచంలో సమస్త సమాచారాలను మనకు అందిస్తుంది. అయితే మన అవసరాలు తీర్చడంతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువగా స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్స్, టాబ్స్ వాడడం వలన కళ్లలో ఉండే నీరు ఇంకిపోయి కళ్లు పొడిబారిపోతాయి. 
 
ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగనట్లుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 70 శాతం మంది కళ్లు పొడిబారిన వారిలో సగం మంది 20 నుండి 30 మధ్య వయస్సు వారి ఉన్నారు. ఈ సమస్య కారణంగా కంటికి అవసరమైయ్యే నీరు ఉత్పత్తి కావడం లేదని ఎయిమ్స్ గతేడాది నిర్వహించిన సర్వేలో తెలియజేశారు. 
 
కంటి సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చే ప్రతీ పదిమందిలో ఏడుగురు డిజిటల్‌ విజన్‌ సిండ్రోమ్‌తో బాధ పడుతున్నట్లుగా వైద్యునిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా గడిచిన నాలుగేళ్లలో 54 శాతం కంటి చుక్కల మందుల వ్యాపారం పెరిగింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments