భారతదేశంలో 2023 సంవత్సరపు ఫుడ్‌ ట్రెండ్స్‌ ఇవే

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (18:31 IST)
ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా ఫుడీస్‌, హోమ్‌ చెఫ్‌లు తమ అభిమాన ఫుడ్స్‌కు ఓటు వేయడంతో అవి ఆ సంవత్సరపు అభివృద్ధి చెందే ధోరణులగా మారుతుంటాయి. భారతదేశంలో 2023 సంవత్సరపు ఫుడ్‌ ట్రెండ్స్‌ ఏవంటే...ప్రయోగాత్మకత: 2023 సంవత్సరంలో ఆహారం పరంగా ప్రయోగాలు చేయడమనేది నూతన శిఖరాలకు చేరుతుంది. అది అపెటైజర్లు, మెయిన్‌ కోర్సు, డెస్సర్ట్స్‌, బేవరేజస్‌ పరంగా స్పష్టంగా కనిపించనుంది. తెలంగాణాలో సైతం, నూతన పదార్థాలు, మసాలా దినుసులు వాడటంతో పాటుగా అతి సులభంగా వాడే రెసిపీలను ప్రయత్నించి అద్భుత ఫలితాలనూ సాధించే ప్రయత్నం చేస్తారు. ఇవి స్థానికంగా లభించేవి కావడంతో రుచిపరంగా వైవిధ్యతనూ కలిగి ఉంటుంది.

 
చీజ్‌ ఆధారితం: వైవిధ్యమైనది చీజ్‌. ఇది విభిన్నరూపాలు, రుచులలో లభిస్తుంది. దీనిని కూరగాయలు, లేదంటే రోటీ, పుల్కాపై కూడా టాపింగ్‌ చేసుకోవచ్చు. ఇంకా వైవిధ్యత చూపాలనుకుంటే నాచోస్‌, చిప్స్‌, పాప్‌కార్న్‌, కాక్రాస్‌, స్పగెట్టిపై కూడా ఉంచవచ్చు. ఒకవేళ స్పగెట్టితో కలిపి తీసుకుంటే వేయించిన వెల్లుల్లి, నలగ్గొట్టిన మిరిఆయాలు మరువొద్దు. అంతర్జాతీయ ధోరణి అయిన ఫాండ్యూ లాంటివి తెలంగాణాలో కూడా కనబడుతున్నాయి.

 
మిల్లెట్స్‌: ప్రపంచవ్యాప్తంగా తృణధాన్యాల సంవత్సరంగా 2023ను జరుపుతున్నారు. తెలంగాణాలో తృణధాన్యాలను సూపర్‌ఫుడ్స్‌గా చెబుతుంటారు. ఈ మిల్లెట్స్‌ను ఉప్మా, దోశల రూపంలో బ్రేక్‌ఫాస్ట్‌గా తినడంతో పాటుగా లంచ్‌, డిన్నర్‌లో రైస్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. ఖీర్‌, లడ్డూ తరహా రుచులనూ  ఆస్వాదించవచ్చు. రోజువారీ పోషక అవసరాలు తీర్చుకోవడం కోసం మిల్లెట్స్‌ను కొద్దిగా రోస్ట్‌ చేయడం లేదంటే, చక్కటి నాణ్యత కలిగిన గోల్డ్‌డ్రాప్‌లాంటి నూనెలో వేయించి తింటే మరింత రుచిగా ఉంటుంది.
 
మూలాలకు వెళ్తున్నారు: మన పెద్దలు వండిన వంటకాల రుచులను నేటితరం ఆస్వాదించాలనుకుంటూ ఆ రుచులను పునఃసృష్టించే ప్రయత్నం చేస్తుంది. ఈ సంవత్సరం ఎక్కవగానే ఇవి కనబడనున్నాయి.

 
మధ్యమధ్యలో: అతి సరళమైనప్పటికీ, ప్రయోగాత్మకమైనది. ఏదైనా చేసేయడమే- ఏమీ లేకుండా వేయించండి.. మిక్సీ చేయించండి, ఆపై మ్యాజిక్‌ ప్రారంభమవుతుంది. రోటీ, బన్స్‌, పరాటా.. వేటితో అయినా కలిపి తినొచ్చు.

 
చికెన్‌ పాప్‌కార్న్‌, ఇతర రుచులు: ఇది మీ ఊహాలకు తగినట్లే ఉంటుంది. చికెన్‌ పాప్‌కార్న్‌ లేదంటే సాధారణ పాప్‌కార్న్‌, బిండి లేదా మఖానా ఏదైనా కావచ్చు. వీటిని ఇన్‌స్టెంట్‌ నూడిల్స్‌, స్పగెట్టి, రైస్‌, ఓట్‌మీల్‌తో కలిపి తీసుకోవచ్చు.

 
గోల్డ్‌డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా మాట్లాడుతూ, ‘‘ఫుడ్‌ అంటేనే ప్రయోగాలు చేయడం. ప్రతి సంవత్సరం విభిన్నమైన ధోరణులు ఈ ఫుడ్‌లో కనిపిస్తాయి. తెలంగాణాలో మనం ప్రత్యేకంగా ఈ వంటకాలను రూపొందించడం వల్లననే అంతర్జాతీయంగా వాటిరి ఖ్యాతి లభించింది’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments