Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీర్ణవ్యవస్థ నిరంతరం ఇబ్బంది లేకుండా పనిచేయాలంటే...?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (22:15 IST)
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండాలంటే భోజనం తరువాత కొన్ని పనులకు దూరంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. అలా చేస్తే అరుగుదల బాగా జరుగుతుందట. అంతేకాదు జీర్ణవ్యవస్థ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదట. కొందరు రాత్రిపూట భోజనం చేశాక స్నానం చేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటిరెండుసార్లు చేయొచ్చు. అదే అలవాటుగా మారితే స్నానం వల్ల కదలికలు వేగంగా ఉంటాయట.
 
ఆ ప్రభావం జీర్ణవ్యవస్థ మీద పడుతుందట. అరుగుదల మందగిస్తుంది. షవర్‌తో స్నానం చేయడం అస్సలు మంచిది కాదట. నీళ్ళు తాగడం వల్ల ఒత్తిడి జీర్ణవ్యవస్ధపై పడుతుంది. అన్నం తిన్నాక కాసేపు అలా ఇలా నడుస్తూ ఉండాలట. అలాగని ఎక్కువసేపు నడవడం మంచిది కాదట. ఇలా చేయడం వల్ల కొంతమంది వికారం కలగవచ్చు. మరికొందరికి పొట్టలో తిప్పే ప్రమాదం ఉందట. 
 
భోజనం చేశాక రాత్రి పూట చల్లటి నీళ్ళు తాగితే అరుగుదల మీద ప్రభావం చూపుతాయట. అదే గోరువెచ్చని నీళ్ళు తాగితే జీర్ణవ్యవస్ధ పనితీరును వేగవంతం చేస్తాయట. భోజనం చేసిన తరువాత తినడం మంచిది కాదు. తినడానికి..పడుకోవడానికి మధ్య కనీసం గంటన్నర సమయం ఉండాలట. తిన్న వెంటనే పడుకుంటే శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. భోజనం చేశాక టీ, కాఫీలు అస్సలు తాగకూడదట. అలా తాగితే పోషకాహారాలు వంటబట్టవని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments