ఎసిడిటీతో గుండెల్లో మంట ఏర్పడుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. అందుకు గల కారణాలు, నివారించడానికి కొన్నిచిట్కాలు తెలుసుకుందాం...
అసిడిటీకి కారణాలు :
1. సరిగా నిద్ర లేకపోవడం, తీసుకునే ఆహారాన్ని త్వరగా భుజించడం, సరిగా నమిలి తినకపోవడం, సరియైన సమయానికి తినకపోవడం.
2. ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం.
3. ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం.
4. శరీరానికి తగిన బరువుకన్నా ఎక్కువ బరువు ఉండటం. దీంతో ఉదరం, గుండెల్లో మంట ప్రారంభమవుతుంది.
ఎసిడిటీని అదుపు చేసేందుకు చిట్కాలు :
1. ఎసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతిరోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. యాపిల్ పండుతో తయారు చేసిన జ్యూసును తేనెతో కలిపి భోజనానికి తర్వాత తీసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
2. తీసుకునే ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించుకోవాలి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం తీసుకోవడం తగ్గించుకోవాలి.