Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే "విట‌మిన్ సి"

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2016 (11:52 IST)
'విట‌మిన్ సి' ఆహార‌మంటే అధిక శాతం వ‌ర‌కు పులుపుగానే ఉంటుంది. కానీ ఈ రుచిని ఆస్వాదించేందుకు మ‌న‌లో అధిక శాతం మంది అంత‌గా ఆస‌క్తి చూపించ‌రు. కొంచెం పుల్లగా ఉండే సిట్రస్ పండ్లపై ఎవ‌రికీ అంత ఇష్టం కూడా ఉండ‌దు. అయితే వీటిని పక్కన పెడితే మాత్రం ఆరోగ్యాన్నిదూరం చేసుకోవడమే. ఎందుకంటే విట‌మిన్ "సి" లో ఉన్న పండ్ల‌ను తీసుకోక‌పోతే ర‌క్తం త‌గ్గిపోతుంది. ఎందుకంటే ఫ‌లాల్లో స‌మృద్ధిగా ఉండే విట‌మిన్ "సి"ని త‌గినంత తీసుకోక‌పోతే శ‌రీరం గ్ర‌హించుకునే ఐర‌న్ శాతం త‌క్కువ‌వుతుంది. 
 
తాజాగా ఉండే చాలా ఫలాల్లో విటమిన్ సి ఉంటుంది. ఉసిరి, జామ, నిమ్మ, టమాట, అనాస, బొప్పాయి, మామిడి, జీడిమామిడి వంటి పండ్లలో "సి" విటమిన్ సమృద్ధిగా దొరుకుతుంది. ఆరోగ్యంగా ఉండే మధ్యవయస్సు వారు రోజుకి 50 నుంచి 75 మిల్లీగ్రాముల "సి" విటమిన్ తీసుకోవాలి. 
 
విటమిన్ 'సి లోపం వల్ల వచ్చే సాధారణ వ్యాధి స్కర్వీ. దీని వల్ల నోటిలో చిగుళ్లు వాచి, రక్తం కారుతుంది. ఒక్కోసారి ముక్కులోంచి రక్తం కూడా రావచ్చు. అదేవిధంగా చర్మం కింద ముఖ్యంగా కాళ్ల వెనుక భాగంలో అక్కడక్కడ రక్తం గ‌డ్డ కట్టుకుపోతుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానవు. రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారు. పిల్లల్లో ఎముకలు పెరగకపోవడం, ప్రతి చిన్న విషయానికి చిరాకుపడడం వంటి సమస్యలు ఏర్పడుతుంది. 
 
విటమిన్ 'సి' యాంటీఆక్సిడెంట్స్ ఫుడ్స్‌లో ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి ఫ్రీరాడికల్ డ్యామేజ్ కలగకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం అవుతాయి. కాబట్టి, ఇలాంటి పరిస్థితిలో విటమిన్ సి ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. శరీరానికి విటమిన్ సి చాలా అత్యవసరం. ముఖ్యంగా దీని వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. అందుకు విటమిన్ సి అధికంగా ఉన్నఆహారాలు తీసుకోమని నిపుణులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments