Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై హెల్త్ మినిస్ట్రీ ఏం చెప్పింది.. మోదీ వేడినీరే తాగుతున్నారట..! (video)

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:45 IST)
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆనందంగా, ఆరోగ్యంగా వుండాలంటే.. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పిలుపు నిచ్చారు. ఆయుష్ మినిస్ట్రీ సూచనలు పాటిద్దామన్నారు. ఆయుష్ మినిస్ట్రీ సూచన మేరకే చాలా రోజుల నుంచి వేడి నీళ్లు తాగుతున్నానని మోదీ వ్యాఖ్యానించారు. 
 
అలాగే తులసీ దళాలను నీటిలో వేసి ఆ నీటిని సేవించడం ద్వారా జలుబు, దగ్గు, గొంతునొప్పి మాయమవుతుంది. రెండు లేదా మూడు ఆకులను నమలడం ద్వారా.. ఇంకా తులసీ రసాన్ని తేనెలో కలిపి తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, శొంఠి, కిస్ మిస్‌లు ఆహారంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఉసిరికాయను రోజూ ఒకటి తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరగడం ద్వారా కరోనాలాంటి వ్యాధులు దరిచేరవు అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. 
 
ఇకపోతే.. ముఖ్యంగా వ్యాయాయం చేయడం, యోగా చేయడం వంటివి మరిచిపోకూడదు. శరీరం ఫిట్‌గా వుంటే అనారోగ్య సమస్యలు అవంతట అవే పటాపంచలవుతాయి. ఒకవేళ చేరినా.. వాటి నుంచి తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజూ కనీసం 30 నిమిషాలపాటు ప్రాణాయామం, ధ్యానం చేయండని ఇటీవల ఆయుష్ మినిస్ట్రీ కూడా సూచించింది.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments