Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాగా ఎక్కువున్న గింజలు కలిగిన జామపళ్లు తింటే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (21:37 IST)
పచ్చి జామకాయల్లో పాస్పారిక్, ఆక్సాలిక్ వంటి ఆమ్లాలు ఉంటాయి. వాటిని తింటే కడుపు నొప్పి వస్తుంది. అదేవిధంగా ఎక్కువగా గింజలు ఉన్న జామపళ్లను తింటే అపెండిసైటిస్( 24 గంటల జబ్బు) వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల దోరగా పండిన జామ పండును గానీ, లేదంటే గింజలు తక్కువ ఉన్న జామకాయను కానీ తినాలి.
 
ఇక జామకాయల్లో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. దంతాలు, చిగుళ్లనుంచి రక్తం కారేవారు జామకాయను కొరికి, బాగా నమిలి చప్పరించి ఆ పిప్పిని ఊసేయాలి. ఇలా చేయటం వల్ల రక్తం కారటం ఆగిపోవటమేకాదు దంతాలకు మేలు కలుగుతుంది. 
 
గుండె బలహీనంగా ఉన్నవారు, క్షయవ్యాధితో బాధపడేవారు, బహిస్టు నొప్పులు అధికంగా ఉన్నవారు పండిన జామగుజ్జుతో తేనె, పాలు కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు సౌందర్యానికి జామ ఎంతో ఉపయోగపడుతుంది. జామ ఆకులను మెత్తగా నూరి ముఖంమీద వచ్చే మొటిమలకు రాసినట్లయితే అవి తగ్గిపోతాయి. తరచుగా జలుబుతో బాధపడేవారు పండిన జామపండులో ఓ 5 గ్రాముల జామచెట్టు బెరడును కలిపి సేవిస్తే సమస్యనుంచి బయట పడవచ్చు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments