Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగనిరోధక శక్తికి ఆహార నియమాలివే..?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (10:16 IST)
ఆహారం విషయంలో సరైన అవగాహన, శ్రద్ధ లేకపోవడం వలన, ప్రకృతి వైపరీత్యముల వలన అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. అనారోగ్యమునకు ప్రధానమైన కారణం మలబద్ధకం. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వలన రకరకాల వ్యాధులు కలుగుచున్నాయి. కనుక సులభంగా జీర్ణమగు ఆహారమును తీసుకున్నచో మలబద్ధకము నుండి తప్పించుకోవచ్చును. 
 
తోటకూర, మెంతికూర, పాలకూర మొదలగు ఆకుకూరలు, బీర, పొట్ల, ముల్లంగి, టమోటా మొదలగు కూరలను, ద్రాక్ష వంటి పండ్లను, ధ్యానముపై ఉండు తౌడును ఉపయోగించడం మంచిది. బలహీనంగా ఉన్నవారు.. నారింజ, ఆపిల్ మొదలగు పండ్ల రసమును సేవించిన ఆకలి పెరుగును. ఆకలి వృద్ధియైన కొలది, కొంచెం కొంచెం ఆహారమును క్రమంగా పెంచి తీసుకొనవలయును. తక్కువగా క్రొవ్వు పదార్థములను కూడా భుజించవలయును. 
 
క్యాల్షియం, ఐరన్, విటమిన్స్ ఎక్కువగా, మాంసకృత్తులు తక్కువగా కలిగిన ఆహార పదార్థాలు తినాలి. అప్పుడే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. స్థూల శరీరముతో బాధపడువారు, తీపి పదార్థములను, క్రొవ్వు పదార్థాములను, పిండి పదార్థములను తగ్గించి, ఆకుకూరలు, పండ్లు, మజ్జిగా ఆహారంగా తీసుకోవలయును. వీలైనంతసేపు నడవడం మంచిది. చెమట ఎక్కువగా పట్టునట్లు చేయవలెను. ఇలా చేయడం వలన శరీరం నందలి మలినములు తొలగిపోవును.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments