Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్‌ఫోన్ మైక్రోవేవ్స్‌...పిల్లలకిస్తే ఏమవుతుందో తెలుసా?

సెల్‌ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని.. సాధ్యమైనంతవరకు సెల్‌ఫోన్‌లో క్లుప్తంగా మాట్లాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునికత పెరిగే కొద్దీ సాంకేతిక పరికరాల

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (13:27 IST)
సెల్‌ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని.. సాధ్యమైనంతవరకు సెల్‌ఫోన్‌లో క్లుప్తంగా మాట్లాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునికత పెరిగే కొద్దీ సాంకేతిక పరికరాల వినియోగం అమాంతం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్లు,  సెల్ ఫోన్లు లేని ప్రపంచాన్ని ఊహించలేం. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ సెల్ ఫోన్ తప్పనిసరి అయ్యింది. 
 
కానీ సెల్ ఫోన్ల ద్వారా మైక్రోవేవ్స్ అనే సూక్ష్మతరంగాలు అతి సులభంగా శరీరంలోకి చొచ్చుకుపోగలుగుతాయి. ఇలా శరీరంలో నుంచి ప్రయాణించే మైక్రోవేవ్స్ ద్వారా శరీరకణాల్లో కొన్ని అవాంఛనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని.. అవి భవిష్యత్తులో మనకు ప్రమాదకరంగా పరిణమిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్ తరంగాలు పెద్దవారి మెదడు కంటే పిల్లల మెదడుపై మూడురెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. 
 
అందుకే సెల్ ఫోన్ వినియోగాన్ని పిల్లలు బాగా తగ్గించాలి. గేమ్స్ కోసం ఫోన్లను అలవాటు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా మనలో ఎడమభాగపు మెదడు కన్నా కుడిభాగపు మెదడు సున్నితంగా ఉంటుంది. అందుకని సెల్‌లో మాట్లాడేటప్పుడు ఎడమ చెవినే ఎక్కువగా ఉపయోగించడం మంచిది. సెల్‌ఫోన్‌ ఎంత చిన్నగా ఉంటే తరంగాల వల్ల కలిగే దుష్ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది.
 
అందుకే పిల్లలు పెద్దలు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లన పరిమితంగా ఉపయోగించాలి. ఆహారం తీసుకునేటప్పుడు పిల్లలకు గేమ్స్ చూస్తూ తినిపించకూడదు. కుటుంబసభ్యులతో కలిసి ఆహారం ఇవ్వడం అలవాటు చేయాలి. స్మార్ట్ ఫోన్లను పడకగదిలో ఉంచకండి. రోజుకు రెండు గంటల వరకే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను పిల్లలు ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments