చేపనూనె తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావచ్చు?

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (21:19 IST)
చేప నూనె తగిన విధంగా నోటితో తీసుకున్నప్పుడు సురక్షితంగా ఉంటుంది. చేప నూనెను శిశువులకు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలతో వైద్యుల సూచన మేరకు వాడాల్సి వుంటుంది. కౌమారదశలో, చేప నూనెను 12 వారాల పాటు రోజూ సుమారు 2.2 గ్రాముల మోతాదులో సురక్షితంగా ఉపయోగించవచ్చని వైద్యులు చెపుతారు.
 
కానీ చిన్న పిల్లలు వారానికి రెండు ఔన్సుల కంటే ఎక్కువ తినకూడదు. చేపల నూనెను ఆహార వనరుల నుండి పెద్ద మొత్తంలో తినేటప్పుడు అది సురక్షితం కాదు. కొవ్వు చేపలలో పాదరసం వంటి టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి. కలుషితమైన చేపలను తరచూ తినడం వల్ల పిల్లల్లో మెదడు దెబ్బతినడం, మెంటల్ రిటార్డేషన్, అంధత్వం, మూర్ఛలు వచ్చే అవకాశం లేకపోలేదు.
 
గర్భిణి, పాలిచ్చే తల్లులు చేప నూనెను వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. నెలలు నిండుతున్న సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని రకాల చేపలకు దూరంగా వుండాలి. ఎందుకంటే వీటిలో అధిక స్థాయిలో పాదరసం ఉండవచ్చు. ఇతర చేపల వినియోగాన్ని వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాలి. ఆహార వనరులను పెద్ద మొత్తంలో వినియోగించినప్పుడు చేపల నూనె సురక్షితం కాదు. కొవ్వు చేపలలో పాదరసం వంటి టాక్సిన్స్ ఉంటాయి.
 
కాలేయ వ్యాధితో వున్నవారు, కాలేయ సమస్యలున్న వారిలో ఫిష్ ఆయిల్ రక్తస్రావానికి గురి చేసే అవకాశం వుంది. చేప నూనె తీసుకోవడం కొన్నిసార్లు మానసిక ఒత్తిడిని పెంచే అవకాశం వుంది. చేప నూనె అధిక మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ మరింత కష్టమవుతుందని, ఫలితంగా మధుమేహులలో సమస్య తలెత్తే ఆస్కారం వుందన్న ఆందోళన ఉంది.
 
ఫిష్ ఆయిల్ రక్తపోటును తగ్గిస్తుంది. రక్తపోటు తగ్గించే మందులతో చికిత్స పొందుతున్న వారిలో రక్తపోటు చాలా తక్కువగా పడిపోవచ్చు. కనుక చేపనూనె అనేది వైద్యుల సలహా మేరకే వాడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

తర్వాతి కథనం
Show comments