ఒక్క పిజ్జా తింటే నాలుగు కిలోమీటర్లు వేగంగా నడవాలట.. (video)

ఆహారపు అలవాట్లలో మార్పు, ఫాస్ట్ ఫుడ్‌ను తెగ లాగించడం ద్వారా గుండెపోటు ఏర్పడే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడంతో పాటు ఫాస్ట్ ఫుడ్‌ అధికంగా తీసుకోవడం ద్వారా అ

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (17:43 IST)
ఆహారపు అలవాట్లలో మార్పు, ఫాస్ట్ ఫుడ్‌ను తెగ లాగించడం ద్వారా గుండెపోటు ఏర్పడే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడంతో పాటు ఫాస్ట్ ఫుడ్‌ అధికంగా తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్ కేవలం రుచినిస్తాయే కానీ.. ఆరోగ్యానికి మేలు చేయవు. 
 
అధిక కేలరీలు కలిగిన ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఒబిసిటీ తప్పవు. సంప్రదాయ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు పారిపోతాయి. కానీ పాశ్చాత్య ఆహారానికి అలవాటుపడి బర్గర్లు, పిజ్జాలు తింటూ అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారు చాలామంది. ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే పిల్లల్లోనూ, పెద్దల్లోనూ వ్యాధులు తప్పవు. 
 
ఒక పూర్తి పిజ్జాను తింటే శరీరంలో చేరే కేలరీలను ఖర్చు చేసేందుకు నాలుగు కిలోమీటర్ల మేర వేగంగా నడవాల్సి వుంటుంది. కానీ మనం ఒక్క కిలోమీటరైనా నడుస్తున్నామన్నా అనేది గుర్తు చేసుకోవాలి. అలాంటప్పుడు అధిక కేలరీలు వున్న ఆహారాన్ని తీసుకుంటే.. శరీరంలో కొవ్వు చేరక ఏం చేస్తుందని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. అందుకే పోషకాలతో నిండిన మితాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంకా రెడీమేడ్ ఫుడ్స్ ఇన్సులిన్ ఉత్పత్తికి అడ్డంగా పరిణమిస్తాయి. తద్వారా మధుమేహం తప్పదు. అధిక కొవ్వుతో ఒబిసిటీ తప్పదు. చిన్నారులు అధికంగా ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే.. పెరుగుదలకు అవసరమైన పోషకాలు లభించవు. ఫలితంగా వారిలోనూ ఊబకాయం ఆవహిస్తుంది. జంక్స్ ఫుడ్స్ తినే మహిళల్లో నెలసరి సమస్యలు ఏర్పడుతాయి. అలాగే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. తద్వారా గుండెపోటు ఏర్పడే ప్రమాదం వుంది. ఫాస్ట్ ఫుడ్స్‌లో వుండే ఉప్పుతో హైబీపీ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

రికార్డు స్థాయిలో లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

Himanshu post: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణ.. అయినా రిలాక్స్‌గా కేసీఆర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

తర్వాతి కథనం
Show comments