Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీని ఎక్కువ సమయం చూస్తూ స్నాక్స్ తినేవారు.. కాస్త జాగ్రత్త..!

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (16:59 IST)
సాధారణంగా మనలో చాలా మంది టీవీ చూసే సమయంలో అదే పనిగా స్నాక్స్‌ని లాంగించేస్తుంటారు. అయితే అలాంటి వారు ఇక జాగ్రత్త పడక తప్పదు. టీవీ చూస్తూ స్నాక్స్ తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇది సరదాకి చెబుతున్న విషయం కాదు సుమీ..సైంటిస్టులు పరిశోధనలు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు.
 
బ్రెజిల్ దేశానికి చెందిన పలువురు శాస్త్రవేత్తలు అక్కడే నివాసం ఉంటున్న 12 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సున్న 33,900 మంది టీనేజర్ల ఆహారపు అలవాట్లు, వారికి ఉన్న వ్యాధులు, వారి జీవనశైలి తదితర అంశాల సమాచారాన్ని మొత్తం సేకరించి విశ్లేషించారు. దీంతో అసలు విషయం బయటపడింది. 
 
నిత్యం 6 గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారిలో కొందరికి మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉన్నట్లు గుర్తించారు. మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉంటే డయాబెటిస్‌, గుండె జబ్బులు త్వరగా వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. కనుక టీవీ ఎక్కువగా చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారు ఆ అలవాటును మానుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments