టీవీని ఎక్కువ సమయం చూస్తూ స్నాక్స్ తినేవారు.. కాస్త జాగ్రత్త..!

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (16:59 IST)
సాధారణంగా మనలో చాలా మంది టీవీ చూసే సమయంలో అదే పనిగా స్నాక్స్‌ని లాంగించేస్తుంటారు. అయితే అలాంటి వారు ఇక జాగ్రత్త పడక తప్పదు. టీవీ చూస్తూ స్నాక్స్ తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇది సరదాకి చెబుతున్న విషయం కాదు సుమీ..సైంటిస్టులు పరిశోధనలు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు.
 
బ్రెజిల్ దేశానికి చెందిన పలువురు శాస్త్రవేత్తలు అక్కడే నివాసం ఉంటున్న 12 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సున్న 33,900 మంది టీనేజర్ల ఆహారపు అలవాట్లు, వారికి ఉన్న వ్యాధులు, వారి జీవనశైలి తదితర అంశాల సమాచారాన్ని మొత్తం సేకరించి విశ్లేషించారు. దీంతో అసలు విషయం బయటపడింది. 
 
నిత్యం 6 గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారిలో కొందరికి మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉన్నట్లు గుర్తించారు. మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉంటే డయాబెటిస్‌, గుండె జబ్బులు త్వరగా వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. కనుక టీవీ ఎక్కువగా చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారు ఆ అలవాటును మానుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

ఫరిదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్‌లో ఉన్నత విద్యావంతులే కీలక భాగస్వాములు...

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

తర్వాతి కథనం
Show comments