Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ పరగడుపున పుచ్చకాయ, స్ట్రాబెర్రీ ముక్కల్ని తీసుకుంటే?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (13:28 IST)
రోజూ ఉదయం పూట లేవగానే పరగడుపున ఈ పదార్థాలను తీసుకోవడం ద్వారా మానసిక ఉత్సాహంతో పాటు ఆరోగ్యం చేకూరుతుంది. ఉదయం పూట పరగడుపున రెండు గ్లాసుల గోరు వెచ్చని నీటిని సేవించడం ద్వారా బరువు తగ్గుతుంది. శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం యవ్వనంగా తయారవుతుంది. అజీర్తి సమస్యలు వుండవు. 
 
గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగితే.. శరీరానికి బలం చేకూరుతుంది. జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు సమస్యలు వుండవు. రక్తం శుద్ధికి ఉపకరిస్తుంది. నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. 
 
మెంతులను నానబెట్టిన నీరు లేకుంటే, జీలకర్ర నానబెట్టిన నీటిని రోజూ తీసుకుంటే లేదా పరగడుపున తీసుకుంటే.. రక్త ప్రసరణ మెరుగ్గా వుంటుంది. మొలకెత్తిన ధాన్యాల్లో ధాతువులు, ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి. ఇందులోని యాంటీ -యాక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలోని కొవ్వును నియంత్రిస్తాయి. హృద్రోగాలను దూరం చేస్తాయి. 
 
బరువును తగ్గిస్తాయి. పరగడుపున క్యారెట్, ముల్లంగి, కీరదోసకాయ ముక్కులను తీసుకోవచ్చు. ఇంకా తాజా పండ్ల రసాన్ని కూడా తీసుకోవచ్చు. రోజూ పరగడుపున కివీ, ఆపిల్, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, బొప్పాయి వంటి పండ్ల ముక్కలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. కానీ ఆరెంజ్, అరటి పండ్లను మాత్రం పరగడుపున తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments