Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలను మళ్లీ మళ్లీ వేడి చేస్తున్నారా?

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (16:21 IST)
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో పాలు ప్యాకెట్లలో లభ్యమవుతాయి. అదే గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతుల నుంచి పాలను కొని తెచ్చుకుంటారు. ఇలాంటి పాలను ఒకసారి కాస్తారు. అవి చల్లారిన తర్వాత మళ్లీ మళ్లీ కాస్తుంటారు. దీనివల్ల మంచి కంటే హాని జరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఇండియన్ మెడికల్ అకాడెమీ వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో... ఒకసారి కాచిన పాలను అవసరమైనప్పుడల్లా తిరిగి మళ్లీ అధిక ఉష్ణోగ్రతలో కాచి వాడుతున్నట్టు తేలింది. అంటే 25-40 ఏళ్ల మధ్య వయసున్న 300 మంది మహిళలను అధ్యయనంలో భాగంగా ప్రశ్నించారు. 39 శాతం మంది పాలను మూడు కంటే ఎక్కువ సార్లు కాచి వాడుతున్నట్టు వెల్లడించారు.
 
62 శాతం మంది ఐదు నిమిషాల కంటే అధిక సమయం పాటు పాలను కాస్తున్నారట. 72 శాతం మంది పాలను కాస్తున్నప్పుడు గరిటెతో తిప్పడం లేదని తేలింది. 'అధిక ఉష్ణోగ్రత వద్ద పాలను మళ్లీ మళ్లీ కాచడం వల్ల ముఖ్యంగా బీ గ్రూపు విటమిన్లు ఆవిరైపోతాయి. అందుకే పాలను రెండు సార్లకు మించి కాకుండా ప్రతీ సారి రెండు మూడు నిమిషాలకు మించకుండా కాచుకోవాలి' అని ఈ అధ్యయనంపై పాల్గొన్న పరిశోధకులు సలహా ఇస్తున్నారు. వీలైతే ఒకసారి కాచిన పాలనే తాగడం మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments