Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెటీనా దెబ్బతింటే కంటి చూపు..?

Webdunia
మంగళవారం, 21 మే 2019 (15:44 IST)
రెటీనా దెబ్బతింటే కంటి చూపు మందగిస్తుందని మనకు తెలుసు, అలాగే రెటీనా దెబ్బతిన్న వారిలో కొంత మందికి మతిమరుపు కూడా ఉంటోందని గుర్తించారు పరిశోధకులు. ఇటీవల ఓ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. దెబ్బ తిన్న రెటీనా ఆధారంగా వ్యక్తికి మతిమరుపు (డిమెన్షియా) సమస్య ఉన్నట్లు తేల్చవచ్చంటున్నారు. 
 
రెటీనాలోని రక్తనాళాలు దెబ్బ తినడం అనేది వారిలో మతిమరుపు వ్యాధికి సంకేతంగా కూడా భావించాలని వారంటున్నారు. పరిశోధకులు కొంత మంది ఇటీవల 69 నుంచి 97 మధ్య వయస్సు ఉన్న వారిని పరిశీలించారు. వీరిలో 50 శాతం కంటే ఎక్కువ మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సాధారణంగా రక్తపోటు వలన కంటిలోని రెటీనా దెబ్బతింటుంటుంది. 
 
అయితే ఈ సమస్య అంతటితో పరిమితం కాదు. ఇలా కంట్లోని రక్తనాళాలు దెబ్బ తిన్న వారి కేంద్రనాడీ వ్యవస్థలోనూ అంటే మెదడులోనూ కొన్ని సమస్యలు ఉంటాయనే మరో నిజం కూడా ఈ సందర్భంగా బయటపడింది. దీని వల్ల కలిగే దుష్ప్రభావం ఏమిటంటే, వీరికి మతిమరుపు వ్యాధి కూడా ఉంటుంది. అందుకే కంటి సమస్యలు తలెత్తిన వారు న్యూరాలజిస్ట్‌ని కూడా సంప్రదించి పరీక్ష చేయించుకోవాలంటున్నారు నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాలో మరో విషాదం : కూలిన ప్రైవేట్ జెట్... ఆరుగురు దుర్మరణం

బండికి వార్నింగ్ : గద్దర్ అన్న గల్లీ అని రాసుకునేటట్లు చేస్తా బిడ్డా.. సీఎం రేవంత్ రెడ్డి

మనిషి కాదు.... కామాంధుడు కంటే ఎక్కువ.. కుక్కను కూడా వదిలిపెట్టలేదు... (Video)

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

తర్వాతి కథనం
Show comments