రెటీనా దెబ్బతింటే కంటి చూపు..?

Webdunia
మంగళవారం, 21 మే 2019 (15:44 IST)
రెటీనా దెబ్బతింటే కంటి చూపు మందగిస్తుందని మనకు తెలుసు, అలాగే రెటీనా దెబ్బతిన్న వారిలో కొంత మందికి మతిమరుపు కూడా ఉంటోందని గుర్తించారు పరిశోధకులు. ఇటీవల ఓ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. దెబ్బ తిన్న రెటీనా ఆధారంగా వ్యక్తికి మతిమరుపు (డిమెన్షియా) సమస్య ఉన్నట్లు తేల్చవచ్చంటున్నారు. 
 
రెటీనాలోని రక్తనాళాలు దెబ్బ తినడం అనేది వారిలో మతిమరుపు వ్యాధికి సంకేతంగా కూడా భావించాలని వారంటున్నారు. పరిశోధకులు కొంత మంది ఇటీవల 69 నుంచి 97 మధ్య వయస్సు ఉన్న వారిని పరిశీలించారు. వీరిలో 50 శాతం కంటే ఎక్కువ మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సాధారణంగా రక్తపోటు వలన కంటిలోని రెటీనా దెబ్బతింటుంటుంది. 
 
అయితే ఈ సమస్య అంతటితో పరిమితం కాదు. ఇలా కంట్లోని రక్తనాళాలు దెబ్బ తిన్న వారి కేంద్రనాడీ వ్యవస్థలోనూ అంటే మెదడులోనూ కొన్ని సమస్యలు ఉంటాయనే మరో నిజం కూడా ఈ సందర్భంగా బయటపడింది. దీని వల్ల కలిగే దుష్ప్రభావం ఏమిటంటే, వీరికి మతిమరుపు వ్యాధి కూడా ఉంటుంది. అందుకే కంటి సమస్యలు తలెత్తిన వారు న్యూరాలజిస్ట్‌ని కూడా సంప్రదించి పరీక్ష చేయించుకోవాలంటున్నారు నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ambassador Car: పాత అంబాసిడర్ కారు పక్కన ఫోజులిచ్చిన చంద్రబాబు.. ఫోటోలు వైరల్ (video)

Anchor Shyamala: కర్నూలు బస్సు ప్రమాదం: 27 మంది వైఎస్‌ఆర్‌సిపి సభ్యులపై కేసు

AP: శ్రీశైలం నుండి విద్యుత్ కోసం తెలంగాణ వాటర్ తీసుకోవద్దు.. ఏపీ విజ్ఞప్తి

Krishna Water: సముద్రంలోకి 4.32 లక్షల క్యూసెక్కుల కృష్ణానది జలాలు

kasibugga stampede ఆ ఆలయం పండా అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

తర్వాతి కథనం
Show comments