Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట నిండే వరకు తినొద్దు? మితంగా తినండి లేకుంటే?

కంచం ముందు కూర్చుంటే కొందరు కడుపు నిండిపోయే వరకూ ఏమాత్రం ఆగలేరు. పొట్ట నిండే వరకు తినాలి. కానీ భోజనం మొత్తం ముగించిన తర్వాత కూడా కడుపులో మరో నాలుగైదు ముద్దలకు చోటుండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

Webdunia
సోమవారం, 22 మే 2017 (10:36 IST)
కంచం ముందు కూర్చుంటే కొందరు కడుపు నిండిపోయే వరకూ ఏమాత్రం ఆగలేరు. పొట్ట నిండే వరకు తినాలి. కానీ భోజనం మొత్తం ముగించిన తర్వాత కూడా కడుపులో మరో నాలుగైదు ముద్దలకు చోటుండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కడుపు నిండా కాకుండా.. నాలుగు ముద్దలు తక్కువ తినేవారి ఆయుర్దాయం ఎక్కువగా ఉంటోందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
ఇలా మితంగా ఆహారం తీసుకోవడం ద్వారా జీవిత చరమాంకంలో అంటే వృద్ధాప్యంలో కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. స్వీట్లు, కొవ్వు, తీపి పదార్ధాల వంటి క్యాలరీలు ఎక్కువగా ఉండే పదార్ధాలు బాగా తగ్గించేసి.. చిన్నతనం నుంచీ పీచుతో సహా చక్కటి పోషకాలుండే పండ్లు, కూరగాయల వంటివి మితంగా తీసుకుంటుండేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నారనీ పరిశోధనలో తేలింది. 
 
ముఖ్యంగా వీరిలో మతిమరుపు, మధుమేహం, క్యాన్సర్ల వంటి జబ్బులు చాలా తక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి తిండి మానేయకూడదు. అలాగని ఎక్కువగానూ తీసుకోకూడదు. మితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments