Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవిస్తూ అవి తింటే గుండెపోటు ఖాయం, ఏంటవి?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (22:59 IST)
మద్యం పుచ్చుకోవడం ఇటీవల సాధారణమైన విషయంగా మారిపోయింది. ఇదివరకు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మద్యం దుకాణాలుండేవి. ఇప్పుడు మెయిన్ రోడ్డు ప్రక్కనే దర్జాగా కుర్చీల్లో కూర్చుని మద్యం బాటిళ్లను ఎదురుగా పెట్టుకుని తాగేస్తున్నారు. వీటితో పాటు సైడ్ డిష్‌గా మసాలాతో దట్టించిన పదార్థాలను కొందరు తింటే మరికొందరు వారికి ఇష్టమైనవవి తీసుకుంటూ వుంటారు. ఐతే కొన్ని పదార్థాలను మద్యంతో పాటు సేవిస్తే గుండెపోటు రావడం ఖాయం అంటున్నాయి పలు అధ్యయనాలు.
 
మద్యం సేవిస్తూ వేయించిన వేరుశెనగ పప్పు, లేదంటే పొడి జీడిపప్పు తినడం చాలామంది చేస్తుంటారు. కానీ వీటిని మద్యంతో పాటు తినరాదంటున్నారు. ఎందుకంటే వేరుశెనగ, జీడిపప్పులో కొలెస్ట్రాల్ అధికం. ఈ కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా హానికరం. కొలెస్ట్రాల్ పెరగితే గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది. కనుక వాటిని తీసుకోకపోవడం మంచిదంటున్నారు.
 
మరికొందరు సోడా లేదా కోల్డ్ డ్రింక్‌తో పాటు మద్యం సేవిస్తుంటారు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎలాగంటే ఆల్కహాల్‌లో సోడా లేదా శీతల పానీయం కలిపి తాగడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం పట్టుతప్పి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
 
మద్యంతో పాటు జున్ను ముక్కలు తింటారు కొందరు. పాల ఉత్పత్తులతో తయారైన వస్తువులను మద్యం సేవించే సమయంలోనే కాదు ఆ తర్వాత ఒక గంట సమయం వరకు తినరాదు. పాలతో చేసిన వస్తువులను తినడం వల్ల జీర్ణక్రియను దెబ్బతీసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే మద్యం సేవిస్తున్న సమయంలోగానీ లేక ఆ తర్వాత ఒక గంటసేపు వరకు తియ్యని పదార్థాలు తినకూడదు. మద్యంతో తీపి తింటే మత్తును రెట్టింపు చేస్తుంది. దీనితో, వ్యక్తి తన నియంత్రణ కోల్పోయే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెపుతున్నారు. కనుక మందుబాబులు తస్మాత్ జాగ్రత్త. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments