వరిపిండిలో పెరుగు కలిపి ముఖానికి పట్టిస్తే..?

ఎన్నిసార్లు ముఖాన్ని శుభ్రపరచుకున్నా ముఖం జిడ్డుగా కనిపిస్తోందా.. మజ్జిగతో ముఖం, మెడను బాగా శుభ్రపరచి పదిహేను నిమిషాల తరవాత ఫౌండేషన్ క్రీం రాసుకున్నట్లయితే ముఖం జిడ్డు కారకుండా ఉంటుంది. మజ్జిగ దాహం తీ

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2016 (14:25 IST)
ఎన్నిసార్లు ముఖాన్ని శుభ్రపరచుకున్నా ముఖం జిడ్డుగా కనిపిస్తోందా.. మజ్జిగతో ముఖం, మెడను బాగా శుభ్రపరచి పదిహేను నిమిషాల తరవాత ఫౌండేషన్ క్రీం రాసుకున్నట్లయితే ముఖం జిడ్డు కారకుండా ఉంటుంది. మజ్జిగ దాహం తీర్చడానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. వరిపిండిలో పెరుగు కలిపి ఆ ముద్దని ముఖానికి, మెడకి, ఒంటికి పట్టించి 15 నిమిషాల తరువాత స్నానం చేయడం మంచిది. దీనివల్ల చర్మం బాగా శుభ్రపడుతుంది.
 
బాదం నూనె, పన్నీరు, ఒక చెంచా మజ్జిగ కలిపి ముఖానికి, మెడకి, శరీరానికి స్నానం ముందు పట్టించి అరగంట తరువాత స్నానం చేయాలి. రెండు చెంచాల ఈస్ట్‌ను రెండు చెంచాల పెరుగుతో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల పాటు ఉంచి తరువాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
 
మజ్జిగను మాడుకు పట్టించి 20 నిమిషాల తర్వాత స్నానం చేస్తే నిగనిగలాడే కురులు మీ సొంతమవుతుంది. మజ్జిగను చర్మానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే.. చర్మ సమస్యలు దూరంకావడంతో పాటు మృదువైన, ప్రకాశమైన  చర్మాన్ని పొందవచ్చు. వారానికోసారి మజ్జిగను చర్మానికి రాసుకుని స్నానం చేస్తే చర్మ సౌందర్యం పెంపొందుతుందని బ్యూటీషియన్లు చెపుతున్నారు. ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తినడంవల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపులో మంట తగ్గుతుంది. మెదడుకి చల్లదనాన్ని కలిగిస్తుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. ఏకంగా 15 బ్యాంకుల శంకుస్థాపన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments