రెస్టారెంట్లకు వెళ్ళి రోస్ట్లు, బర్గర్లు లాగించేస్తున్నారా? బర్గర్లు, బిస్కెట్లు తింటూ, కూల్ డ్రింక్స్ లాగిస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి. మధుమేహం కిడ్నీలకు ఎంత హాని చేస్తుందో బర్గర్లు, వేపుళ్లు, కూల్ డ్రింక్స్ కూడా అంతే కీడు చేస్తాయి. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం, ఉత్పత్తయినా దానికి స్పందించకపోవడమే మధుమేహ వ్యాధి ప్రధాన లక్షణం. ఇలాంటి రోగుల సంఖ్య భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా పెరిగిపోతోంది. తరచూ జంక్ ఫుడ్ తినేవారిలోనూ దాదాపు అదే ఫలితం ఉంటుందని బ్రిటన్లోని అంజిలా రస్కిన్ వర్శిటీ తేల్చింది.
మధుమేహ రోగుల్లోని కిడ్నీల్లో భారీగా ఉండే గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్లు (జీఎల్యూటీ, ఎస్జీఎల్టీ) మాదిరిగానే... బాగా జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు తిన్న వారిలోనూ ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ప్రాసెస్డ్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల తొలుత స్థూలకాయం వస్తుందని, తర్వాత కిడ్నీలపై భారం పడుతుందని పరిశోధకులు అంటున్నారు.