Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్లుల్లితో కాచిన పాలను ఉదయం, రాత్రి పూట తీసుకుంటే?

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (19:30 IST)
వెల్లుల్లి, ఉల్లిపాయలను ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మేలు. వీటిలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలో విటమిన్లు, ఐయోడిన్ వంటివి ఉన్నాయి. 100 గ్రాముల వెల్లుల్లిలో నీటి శాతం 62 శాతం ఉండగా, కార్బొహైడ్రేట్స్ 29.9 శాతం, ప్రోటీన్ 6.3 శాతం, కొవ్వు 0.1 శాతం, ధాతువులు 1.0 శాతం, పీచు పదార్థం 0.8 శాతం ఉంటుంది. ఇంకా కాల్షియం 30 మిల్లీ గ్రాములు, పాస్పరస్ 310 మి.గ్రాములు, ఐరన్ శక్తి 1.3 మి.గ్రాములు, విటమిన్ సీ 13 మిల్లీ గ్రాములు, బి విటమిన్ కూడా ఇందులో ఉంది. 
 
వెల్లుల్లిలోని వాసనకు కారణం అందులోని సల్ఫర్. వెల్లుల్లిలో నీటి ద్వారా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, సైనస్‌ను నివారిస్తుంది. టీబీతో బాధపడే వారు ఒక గ్లాసు పాలతో ఒక గ్లాసు నీరు, పది మిరియాలు, కొంచెం పసుపు పొడి, ఒక వెల్లుల్లి బెరడును వేసి కాసేపు వేడి చేసి దానిని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ వెల్లుల్లితో కాచిన పాలను ఉదయం, రాత్రి పూట తీసుకుంటే జలుబు, దగ్గు, వాతం వంటి వ్యాధులన్నీ నయం అవుతాయి. ఈ పాలు తాగి జలుబు తగ్గిపోతే రెండు పూటల తాగడాన్ని ఆపేయాలి. అలాగే ఈ పాలను ఆస్తమా వ్యాధిగ్రస్తులు సేవిస్తే శ్వాసప్రక్రియ సక్రమమవుతుంది. 
 
అలాగే వెల్లుల్లి మనం తీసుకునే ఆహారంలో కలిపి తీసుకుంటే శరీరంలో వ్యర్థ పదార్థాలు, వైరస్ వంటివి తొలగిపోతాయి. ఇంకా రక్త కణాలను వెల్లుల్లి శుభ్రపరుస్తుందని, అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. తద్వారా శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీంతో మన శరీరానికి తగిన ఆక్సిజన్ లభించడంతో ఒత్తిడి మాయమవడంతో పాటు నరాల పనీతీరు, శ్వాసప్రక్రియ క్రమమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments