Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వుల పొడిని అప్పడాలపై చల్లుకుని తింటే?

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (12:55 IST)
నువ్వులతో తయారు చేసే ఏ ఆహారమైనా చాలా రుచికరంగా ఉంటుంది. నువ్వుల పొడిలో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలున్నాయి. దీనిని రోజూ ఆహారంలో కలుపుకుని తింటే శరీరానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. నువ్వుల పొడిని అప్పడాలపై చల్లుకుని తింటే ఎంతో మేలు చేస్తుంది. పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండే నువ్వుల్లో మన శరీరానికి ఉపయోగకరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. 
 
వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం. ఐరన్‌, ఫాస్పరస్‌, విటమిన్‌ బి, జింక్‌, పీచుపదార్థాలు తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రకరకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నువ్వుల్లో ఉండే కాపర్ రుమటాయిడ్‌ ఆర్థ్రరైటిస్‌ వల్ల కలిగే నొప్పిని, వాపును తగ్గించడంలో సహకరిస్తుంది. ఆస్తమాను అరికట్టడంలో నువ్వులపొడిలోని మాంగనీస్‌ బాగా ఉపకరిస్తుంది.
 
గుండెపోటు, స్ట్రోక్స్‌కు కారణమయ్యే రక్తపోటును నివారించడంలో కూడా నువ్వులపొడిలోని మాంగనీస్‌ ఉపకరిస్తుంది. కలోన్‌ క్యాన్సర్‌, ఆస్టియోపోరోసిస్‌, మైగ్రేన్‌, రుతుస్రావానికి ముందు కలిగే సమస్యలను అరికట్టడంలో వీటిలోని క్యాల్షియం తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించి బరువు అదుపులో ఉంచగల గుణాలు నువ్వుల్లో ఉన్నాయి. నువ్వుల పొడిని తరచూ తీసుకుంటే రకరకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments