Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీర్ణసమస్యతో బాధపడుతున్నారా? కొబ్బరి నీళ్లు, తేనె కలిపి తీసుకుంటే సరి..?

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:13 IST)
సాధారణంగా కొబ్బరి నీళ్లతో అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయన్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. వాటి నుండి ప్రధానంగా ఎన్నో మినరల్స్ మన శరీరానికి అందుతాయి. అదే విధంగా తేనె కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కూడా ఎన్నో ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. 
 
ఇది స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్ కార‌కంగా ప‌నిచేస్తుంది. ఉదయాన్నే ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకుని పరగడుపునే తాగడం వల్ల కలిగే లాభాలను ఓ సారి చూడండి.
 
* కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమాన్ని రోజూ తాగితే జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది. గ్యాస్, కడుపులో మంట, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. అల్సర్లు ఉంటే నయమవుతాయి.
 
* కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ కూడా సమృద్ధిగా ఉండడం వల్ల ఈ మిశ్రమం యాంటీ ఏజింగ్ కారకంగా పనిచేస్తుంది. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు దరి చేరవు. వయస్సు మీద పడడం కారణంగా వచ్చేటువంటి ముడతలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
* శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. ఫలితంగా అధిక బరువుతో బాధపడుతున్నవారు బరువు తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది.
 
* కిడ్నీలు శుభ్రమవుతాయి. శరీరంలోని వ్యర్థపదార్థాలు బయటకి పోతాయి.
 
* కొబ్బరినీళ్లు, తేనె మిశ్రమంలో ఔషధ గుణాలు అధికంగా ఉండడం వల్ల అది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పాటు అందిస్తుంది.
 
* ఈ మిశ్రమంలో యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల కడుపులో ఉండే సూక్ష్మ క్రిములను ఇది పారదోలుతుంది. ఫలితంగా ఇన్‌ఫెక్షన్‌లకు అడ్డుకట్ట వేస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments