Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ టెండూల్కర్‌కి అదివ్వండి, నాకు రాగి జావ ఇవ్వండి, ఏం జరుగుతుందో చూడండి?

Webdunia
సోమవారం, 4 మే 2020 (21:34 IST)
మార్కెట్లో శక్తిని పెంచేందుకు రకరకాల పిండి పదార్థాలు ప్యాకెట్లలో అమ్ముతున్నారు. వాటిని పాలలో కలుపుకుని తాగి బలం శక్తి వస్తుందని అనుకుంటుంటాం. అలాగే క్యాల్షియం పెరుగుతుందని క్యాల్షియం మాత్రలు వేసుకుంటూ వుంటారు మరికొందరు. ఐతే ఓ రైతు ఏమంటున్నారంటే సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తికి మార్కెట్లో అమ్మే శక్తి పౌడర్లు ఇవ్వండి, నాకు మాత్రం రాగి జావ ఇవ్వండి, పది రోజుల పాటు ఇలాగే చేయండి. 
 
ఎవరు వేగంగా పరుగులు తీస్తారో చూడండి అంటూ సవాల్ విసురారు. ఆయన వేసిన సెటైర్లో ఎంతోకొంత నిజం లేకపోలేదు. ఎందుకంటే ప్రకృతి సహజసిద్ధంగా దొరికేవాటిలో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. ప్యాకెట్లలో వచ్చేవి నిల్వబెట్టి రసాయనాలు కలిపి చివరికి చేవలేని పదార్థాల్లో వస్తుంటాయి. కనుక క్యాల్షియం కావాలంటే రాగి జావ తప్పక తీసుకోవాలి. అందులో ఏమున్నాయో తెలుసుకుందాం.
 
రాగులు అతి శక్తివంతమైనవి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉండే విటమిన్లు వయసు మీద పడకుండా చేస్తాయి. రాగులలో వుండే ఎమినో యాసిడ్స్ త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి. శరీర బరువును నియంత్రిస్తాయి. దీనిలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి. అలాగే జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. 
 
నడి వయసు మహిళల్లో ఎముకలు పటుత్వం తగ్గుతుంది కాబట్టి ఈ రాగిజావ తీసుకోవడం వల్ల ఎముకలు పటిష్టంగా అవుతాయి. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి. ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు రోజువారీ ఆహారంలో రాగులను చేర్చుకొనడం ద్వారా తక్షణ శక్తి వస్తుంది. 
 
అంతేగాక రాగులను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత అయోడిన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. రాగులతో చేసిన ఏ ఆహారమైనా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరించి మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. రాగుల జావ దప్పికను అరికడుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments