Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాంతరం ఇలా చేస్తే.. ఏమవుతుందో తెలుసా..?

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (10:09 IST)
మంచి పోషకాహారం తీసుకున్నాం అనుకుని.. ఆరోగ్యానికి ఢోకా లేదని మురిసిపోతే తగదు. భోజనం తరువాత అలవాటులో పొరపాటుగా చేసే కొన్ని పనులు కారణంగా ఆరోగ్యానికి హానికలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే వాటికి వీడ్కోలు పలకాల్సిందే..
 
భోజనం తిన్న వెంటనే టీ తాగితే జీర్ణమవదు. దాంతో తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి. భోజనం చేసే ముందు.. లేదా చేశాక పండ్లు తినకూడదు. ఇలా తినడం వలన పొట్ట పెరుగుతుంది. కనుక రెండింటికీ మధ్య రెండు మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
 
కొందరైతే తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. ఈ పద్ధతి మంచిది కాదంటున్నారు వైద్యులు. ఇలా చేయడం వలన కాళ్లు, చేతుల్లోకి రక్తప్రసరణ పెరుగుతుంది. దీనివలన పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. 
 
అన్నం తిన్నాక అరవై అడుగులు వేస్తే నిండు నూరేళ్లు జీవిస్తారని చెప్తుంటారు. కానీ భోజనం చేయగానే నడిస్తే పోషకాలను గ్రహించడంలో జీర్ణవ్యవస్థ విఫలమవుతుంది. తప్పదనుకుంటే గంట తరువాత నడవండి. భోజనం తినగానే పక్కమీదకు చేరొద్దు. అలా నిద్రలోకి జారుకుంటే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments