Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్కెర వ్యాధికి స్వీట్ రూల్స్, ఇలా చేస్తే డయాబెటిస్ అదుపులో...

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (21:21 IST)
డయాబెటిస్, చక్కెర వ్యాధి లేదా మధుమేహంతో బాధపడే రోగులు ఖచ్చితంగా ఆహార నియమాలను పాటించి తీరాలి. అప్పుడే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఈ వ్యాధి బారినపడినవారు ఆహార నియమం గురించి పడే తపన అంతాఇంతా కాదు. అందుకే ముందుగానే ఆహార నియమం కోసం కొన్ని ప్రణాళికలను తయారు చేసుకుంటే చాలా మంచిది. అలాంటి ప్రణాళికా నియమాలు ఇలా ఉండాలంటున్నారు వైద్యులు.
 
ఉదయం 6 గంటలకు: అర చెంచా మెంతి పొడిని నీటిలో కలిపి సేవించాలి.
ఉదయం 7 గంటలకు: టీ తాగే అలవాటుంటే చక్కెర లేని టీ తీసుకోవచ్చు.
ఉదయం 8.30 గంటలకు: ఒక ప్లేటు ఉప్మా లేదా గోధుమ రవ్వతో చేసిన ఉప్మాతోబాటు అరకప్పు మొలకెత్తిన విత్తనాలు, 100 మిల్లీలీటర్ల చక్కెరలేని పాలను ఆహారంగా తీసుకోవాలి.
ఉదయం 10.30 గంటలకు: 50 గ్రాములున్న పండు లేదా 1 కప్పు పలుచటి మజ్జిగ లేదా చక్కెర లేకుండా నిమ్మకాయ రసంను సేవించాలి.
 
మధ్యాహ్నం భోజనం 12.30 గంటలకు: రెండు చపాతీలు, ఒక కప్పు గంజి తీసివేసిన అన్నం, ఒక కప్పు పప్పు, ఒక కప్పు పెరుగు, అర కప్పు సోయాబీన్ లేదా పనీర్, అరకప్పు ఆకుకూరతో పాటు సలాడ్ ఒక కప్పును ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.
 
సాయంత్రం 4 గంటలకు: ఒక కప్పు చక్కెర లేని టీతో పాటు రెండు బిస్కెట్లు తీసుకోవచ్చు(చక్కెర లేనివి).
సాయంత్రం 6 గంటలకు: ఒక కప్పు సూపు తీసుకోవాలి.
రాత్రి భోజనం 8.30 గంటలకు: మధ్యాహ్నం తీసుకున్న ఆహారం మాదిరాగానే రాత్రిపూట కూడా తీసుకోవాలి.
రాత్రి పడుకునే సమయంలో 10.30 గంటలకు: ఒక కప్పు చక్కెర లేని పాలు సేవించాలి.
 
ఒక్కసారిగా ఆహారాన్ని సమపాళ్ళల్లో తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత విపరీతంగా ఆకలి వేస్తుంటుంది. అలా ఆకలి వేస్తే ఈ సూత్రాలు పాటించండి. పచ్చి కూరగాయలు సలాడ్‌గా తీసుకోవాలి. బ్లాక్ టీ, సూప్, పలుచటి మజ్జిగ, నిమ్మకాయ రసం సేవిస్తుండాలి. ఇందులో ముఖ్యంగా చక్కెర, బెల్లం, తేనె, తీపి పదార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న (video)

Bakrid 2025: దేశ వ్యాప్తంగా బక్రీద్‌ను జరుపుకుంటున్న ముస్లిం సోదరులు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

తర్వాతి కథనం
Show comments