Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి ఆకులోనే ఎందుకు భోజనం చేయాలి?

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (15:24 IST)
ప్రకృతిలో ఎన్నో ఆకులు ఉన్నాయి. వాటన్నింటిలో కాకుండా మన వాళ్ళు కేవలం అరటి ఆకులో భోజనానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తారు. పెళ్ళికెళ్ళినా అరిటాకే. పేరంటానికి వెళ్లినా అరిటాకే.. చివరకు పల్లెల్లో చుట్టానికి కూడా అరాటాకులోనే భోజనం వడ్డిస్తారెందుకు? మామూలు ఆకులో పెడితే భోజనం తినలేరా? ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. భారతీయ వైద్యం చాలా పురాతనమైనది. అంతేకాదు ప్రకృతిలోని ఏ చెట్టు మనకు మేలు చేస్తుందో.. ఏ చెట్టు కీడు చేస్తుందో కూడా ఇట్ట చెప్పేయగల చరిత్ర ఒక్క ఆయుర్వేదానికి మాత్రమే ఉంది. అందుకే భోజనానికి అరటాకు శ్రేష్టమని చెప్పారు. అది ఎలాగో చూడండి.

 
ఆకలి మీద శత్రువైనా ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపే సాంప్రదాయం మనది. అందుకే అతను ఎటువంటి సంకోచమూ లేకుండా ఆరగించడానికి అరటాకులో వడ్డిస్తారు. కారణం ఏంటంటే భోజనంలో విషం కలిపినా వెంటనే బయట పెట్టే గుణం అరటి ఆకుకు ఉంది. ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు. 
 
ఇది అరటాకు మీదనున్న నమ్మకానికి సంబంధించిన విషయం మాత్రమే. కానీ అరటాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వేడివేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి అద్భుతమయిన రుచితో పాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది.
 
ఈ ఆకులో అన్ని రకములయిన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినేఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి. ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం.  ఇది కేన్సరు మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్, హెచ్.ఐ.వి , సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు. అంతేనా ఇది పర్యావరణ సమస్యను తీసుకురాదు. వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోతాయి.  

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments