Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజంతా కుర్చీల్లో కూర్చొంటున్నారా.. అయితే మధుమేహం ఖాయం!

Webdunia
బుధవారం, 6 ఆగస్టు 2014 (13:46 IST)
ఇళ్లలోనూ, ఆఫీసుల్లోనూ ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు మధుమేహంతో పాటు గుండెజబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం లాంటివి మధుమేహం బారిన పడేందుకు ప్రధాన కారణాలని ఈ అధ్యయనం చెబుతోంది. 
 
వీటన్నింటితో పాటు రోజువారీ జీవన విధానం కూడా మధుమేహం ముప్పు పెరిగేందుకు కారణాలుగా ఉంటున్నాయని పరిశోధకులు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రతిరోజూ ఉదయం లేవగానే అరగంటపాటు వ్యాయామం చేసేవారు ఇకపై తమ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని అనుకుంటుంటారుగానీ... నిజానికి రోజంతా ఒళ్లు కదల్చకుండా కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్ని ఈ అరగంట వ్యాయామాలు ఏమాత్రం భర్తీ చేయలేవని వారు చెబుతున్నారు.
 
గంటలతరబడీ అదేపనిగా కూర్చొని పని చేసుకుంటుండేవారు ఎక్కువసేపు కూర్చోకుండా... వీలైనప్పుడల్లా సీట్లోంచి లేచి, అటూ ఇటూ తిరగడం.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఆఫీసు కారిడార్లలో పచార్లు చేయడం లాంటివి చాలా మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
 
ఇలా పచార్లు చేయడం వల్ల... ఉదయంపూట వ్యాయామాలకంటే మంచి ఫలితాలను పొందవచ్చునని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి... మితిమీరిన పనిభారంతో ఆఫీసుల్లోనూ, ఇళ్లలోనూ పనిచేసేవారు ఈ అధ్యయనంలో చెప్పినట్లుగా వీలు చిక్కినప్పుడల్లా లేచి అటూ ఇటూ తిరగడం వల్ల మధుమేహం బారినుంచి తప్పించుకున్నవారవుతారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments