Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారం విషతుల్యమైతే... వాంతులు కావచ్చు.. జాగ్రత్తలు పాటిస్తే సరి..

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (13:19 IST)
మనం తీసుకునే ఆహారం విషంగా మారినట్లైతే వెంటే వాంతులు ఏర్పడతాయి. ఆహారం ఎంత ఆరోగ్యకరమో.. అది విషమైతే అంత ప్రమాదకరం కూడా. ఆహారం ఉన్న చోట శుభ్రంగా లేకున్నా, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహారం లోనూ వైరస్, బ్యాక్టీరియా, పరాన్నజీవులు కలిసి ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. అలాంటి ఆహారాన్ని తిన్నప్పుడు దేహం దానిని వీలయినంత త్వరగా వాంతులు, విరేచనాల రూపంలో విసర్జిస్తుంది. దీనినే ఫుడ్ పాయిజనింగ్,  ఫుడ్ బోర్న్ ఇల్‌నెస్‌గా వ్యవహరిస్తాం.ఈ సమస్యకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి.

వాంతులు ఏర్పడినప్పుడు తులసి ఆకుల రసం ఒక కప్పు తీసుకోవాలి. ఇది కడుపులో చేరిన విషాలను తొలగించి జీర్ణవ్యవస్థను గాడిలో పెడుతుంది. ఈ సమయంలో వీలయినంత ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. ఈ విధంగా ద్రవాహం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్త విశ్రాంతి పొందుతుంది. గంటకోసారి ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక స్పూను చక్కెర, చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే దేహం శక్తిని పుంజుకుంటుంది. 
 
వాంతులవుతున్నప్పుడు కాఫీ, టీలను పూర్తిగా మానేయాలి. పాలను కూడా తీసుకోకపోవడం మంచిది. పూర్తిగా నయమయ్యేంత వరకు బాగా పండిన అరటి పండ్లు, బియ్యం ఉడికించిన జావ, మజ్జిగన్నం తీసుకోవాలి. ఇటువంటి సమయంలో పచ్చి కూరగాయలు, హాఫ్ బాయిల్డ్ ఫుడ్‌ను, మాంసాహారాన్ని అసలు తీసుకోకూడదు. వాంతుల తీవ్రత ఎక్కువగా ఉండి. ఎంతకీ అదుపు కాకపోతే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడడం శ్రేయస్కరం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments