Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యం చలాకీగా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?

Webdunia
మంగళవారం, 4 మార్చి 2014 (16:43 IST)
File
FILE
ప్రతి ఒక్కరూ నేటి సమాజంలో చాలా చలాకీగా ఉండాలనుకుంటారు. అలా ఉండేందుకు కూడా ప్రయత్నిస్తారు. అయితే, వారివారి పనుల ఒత్తిడి వల్ల మానసికంగా నలిగిపోతుంటారు. ఉరుకులు పరుగుల జీవితంలో శారీరకంగా మానసింకంగా కృంగిపోతుంటారు. ముఖ్యంగా మహిళలు అలసిపోతుంటారు, ఇది సహజం, ఎందుకంటే వారికి ఇంట్లో, బయట కూడా రెండు బాధ్యతలు ఒకటి తర్వాత మరొకటి నెరవేర్చాల్సి ఉంటుంది.

కానీ కొంతమంది మహిళలు పగలు రాత్రి పనిలో నిమగ్మమైనా కూడా వారు అలసటగా కనపడరు. మరికొంతమంది మహిళలు మాత్రం తమ జీవితంలో పని ఒత్తిడి కారణంగా త్వరగా అలసటకు లోనవుతుంటారు. అలాంటి వారు వారి శరీరానికి పూర్తిగా విశ్రాంతినివ్వలేరు. నిత్యం చలాకీగా ఉండేందుకు ప్రయత్నిస్తుండాలి. మీరు కూడా అలసట నుంచి ఉపశమనం చెందాలనుకుంటే క్రింద చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరి...

* శరీరానికి ప్రాణవాయువు, ఆహారం ఎంత ముఖ్యమో అంతే మోతాదులో నీరు కూడా ముఖ్యం. శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటే రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీంతో మస్తిష్కానికి కావలసినంత నీరు అందదు. దీంతో మస్తిష్కంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. కాబట్టి అలసటకు లోనవుతుంటారు. అందువల్ల రోజుకు కనీసం 8 గ్లాసుల నీటీని తాగితే ఆరోగ్యానికి మంచిదంటున్నారు వైద్యులు.

* ఆలోచన మనిషిని అలాగే తినేస్తుంటుంది. దీంతో శరీరంలోని శక్తి హరించుకుపోతుంది. సమస్యల గురించి ఆలోచించి సమయం వృధా చేసుకునే కంటే వాటికి పరిష్కారమార్గాలను అన్వేషించాలని వైద్యులు సూచిస్తున్నారు. సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే సమస్య తీరిపోదు. కానీ అదేసమయంలో పరిష్కారం కొరకు మార్గాలను అన్వేషిస్తే సమస్య తీరిపోయి మనసు ఉల్లాసంగా ఉంటుంది. దీంతో అనవసరమైన ఆలోచనలు దరి చేరవు.

* అలసిన శరీరానికి వ్యాయామం చేయడంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో శరీరంలోని నాడీ మండలం జాగరూకతతో ఉంటుంది. నియమానుసారం వ్యాయామం చేస్తే శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా సాగతుంది. శరీరం పటిష్టంగా ఉంటుంది. దీంతో నిద్ర కూడా బాగా పడుతుందంటున్నారు వైద్యులు. దీంతో శరీరంలోని అనవసరమైన కొవ్వు కరిగిపోతుంది. శరీరంలో అనవసరమైన కొవ్వు అధికంగా ఉండటంమూలాన అది అలసటకు దారితీస్తుందంటున్నారు వైద్యులు.

* మీరు చేసే పనిలో మీ శరీరాన్ని ఒకే కోణంలో ఉంచి పనిచేయకూడదంటున్నారు వైద్యులు. దీనివలన శరీరంలో అధిక శక్తి ఖర్చు అవుతుందంటున్నారు వైద్యులు. కాబట్టి చేసే పనిలో కాస్త అటూ ఇటూ కదులుతుండేలా చూసుకోవాలంటున్నారు వారు.

* నిద్రలేమి కూడా మానసిక ఆందోళన పెరగడానికి ఓ కారణమని వైద్యులు చెపుతున్నారు. నిద్రపోయేటప్పుడు గదిలోని కిటికీలు పూర్తిగా తెరిచి ఉంచండి. దీంతో వెలుపలిగాలి బయటకు పోయేందుకు అనువుగా ఉంటుంది. అలాగే మీరు పడకగదిలోని వాతావరణం కూడా నిద్రపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందంటున్నారు. ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారంలో ఏదైనా మార్పులుంటే అది కూడా నిద్రను పాడుచేస్తుందంటున్నారు వైద్యులు.

* అధికంగా భోజనం చేస్తే శరీరానికి కావలసిన రక్తం మరియు ఆక్సిజన్ ఆ భోజనాన్ని జీర్ణం చేయడానికే సరిపోతుంది. దీంతో మెదడుకు చేరవలసిన రక్తం, ఆక్సిజన్ తగ్గి శరీరానికి అలసట చేకూరుతుంది. కాబట్టి ఇష్టమైన ఆహారంకూడా మితంగా తీసుకుంటే శరీరానికి ఏ మాత్రం ఇబ్బంది కలగదని వైద్యులు సూచించారు.

* ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో సరైన క్యాలరీలు శరీరానికి అందేలా చూసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలుండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం మూడు పూటలా ఆహారం శరీరానికి అందేలా చూసుకోవాలి. ఆహార పదార్థాలను సరైన పద్దతిలో తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే తప్పనిసరిగా చలాకీగా ఉంటారంటున్నారు వైద్యులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

జగన్నాథ రథయాత్రలో అపశృతి : ముగ్గురి మృతి

బీహార్‌లో మొబైల్ ఓటింగ్.. దేశంలోనే తొలిసారి..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Show comments