హిమాలయాల్లో నడిచే చేపలు... తుమ్మే కోతులు...

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2015 (18:09 IST)
ఈ భూమండలం అనేక జీవరాశులకు నిలయం. మానవుడి దృష్టిలో పడని జీవరాశులు ఎన్నెన్నో. ఐతే భూమిపై మానవుడి నిత్యం శోధన చేస్తూనే ఉన్నాడు. అడవులు, నీటి ప్రవాహాలు, నదులు, సముద్రాలు... మంచుకొండలు.... ఇలా అనేక ప్రాంతాలను పరిశీలిస్తూ అక్కడి పరిస్థితులను, జీవరాశుల మనుగడను తెలుసుకుంటున్నాడు. పరిశోధనలో భాగంగా ఇటీవల హిమాలయాలపై కొందరు శాస్త్రజ్ఞలు పర్యటించినపుడు వారికి అరుదైన జాతుల ఆనవాళ్లు అగుపించాయి.
 
సుమారు 211 జాతులను కనుగొనగా వాటిలో రెండు రకాల జాతుల ప్రవర్తన వారికి ఆసక్తిని రేకెత్తించాయట. దాంతో ఆ జాతులపై మరింత లోతుగా అధ్యయనం చేసినప్పుడు పలు విషయాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా హిమాలయాల్లో రెండు భిన్నమైన జాతుల గురించి వారు నిశితంగా గమనించినప్పుడు... ఒకటి నేలపై నడిచే చేప. ఇది నేలపై నాలుగు రోజుల పాటు అలాగే ఉండగలదట. అలాగే సుమారు 400 మీటర్ల మేర గెంతుకుంటూ వెళ్లగలదట. చేప అనగానే నీటిలో మాత్రమే ఉంటుందని అనుకుంటారు కానీ ఈ చేప గాలిని పీల్చుతూ నాలుగురోజుల పాటు భూమిపై ఉండగలదట. 
 
అదేవిధంగా హిమాలయాల్లో ఒకరకమైన జాతికి చెందిన కోతులుండేవట. వర్షం వచ్చినప్పుడు అవి తుమ్మడం ప్రారంభించేవట. దీనికి కారణం... వాటి ముక్కులు పైకి లేచి ఆకాశం వైపు చూస్తున్నట్లుండటమే. అందువల్ల వర్షం రాగానే వర్షపు చినుకులు నేరుగా వాటి ముక్కురంధ్రాల్లోకి చేరడంతో తమ్ములు వచ్చేవి. 
 
ఈ బాధను భరించలేని ఆ కోతులు తమ ముఖాన్ని రెండు కాళ్లకు మధ్యలో పెట్టుకుని అలా వంచుకుని వర్షం పడినంత సేపు కూర్చునే ఉండేవట. ఇలాంటి ఎన్నో జాతులు ఇప్పుడు నశించిపోయాయనీ, పర్యావరణ కాలుష్యం కారణంగా ఎన్నో జాతులు కనుమరుగయిపోతున్నాయనీ, ఇలాగే వదిలేస్తే మనిషి మనుగడకు ఏదో ఒకరోజు ముప్పు తప్పదని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను మంత్రిగా చేయలేని పనిని ఓ అమ్మాయి సాధించింది: రఘువీరా రెడ్డి ప్రశంస (video)

వివాహేతర సంబంధం: వివాహిత కోసం పాత ప్రియుడిని చంపేసిన కొత్త ప్రియుడు

బంగ్లాదేశ్‌లో హిందువులను చంపేస్తున్నారు... మరొకరిని కొట్టి నిప్పంటించారు...

భర్త వియోగం తట్టుకోలేక... ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి కూడా..

నూతన సంవత్సర వేడుకల్లో పూటుగా తాగి పడిపోయిన బెంగళూరు యువతులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతడు ఓ దుర్మార్గుడు - మహిళలను మానసిక క్షోభకు గురిచేస్తారు : పూనమ్ కౌర్

కింగ్డమ్ ఫస్ట్ పార్ట్ దెబ్బేసింది, ఇంక రెండో పార్ట్ ఎందుకు? ఆగిపోయినట్లేనా?

'రాజాసాబ్' విజయం సాధించకూడదని కొందరు కోరుకుంటున్నారు : మారుతి

మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిని : హీరో నవీన్ పోలిశెట్టి

శివాజీ గారు అలా మాట్లాడితే విజిల్స్, చప్పట్లు కొట్టారు, వాళ్లనేం చేయాలి?: నవదీప్ ప్రశ్న

Show comments