Webdunia - Bharat's app for daily news and videos

Install App

42 శాతం పెరిగిన వంట గ్యాస్ ధర - 92 శాతం తగ్గిన రాయితీ

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (08:20 IST)
దేశంలో వంట గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 500 నుంచి 700 రూపాయల మేరకు ఉన్న ఈ వంట గ్యాస్ ధరలు ఇపుడు ఏకంగా 1000 నుంచి 1200 రూపాయలకు చేరుకున్నాయి. ముఖ్యంగా, గత ఐదేళ్ల కాలంలో వీటి ధరలు 42 శాతం మేరకు పెరిగాయి. అదేసమయంలో వంటగ్యాస్ లబ్దిదారులకు కేంద్రం ఇచ్చే రాయితీ మొత్తంలో మొత్తం ఏకంగా 92 శాతం మేరకు తగ్గాయి. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి రామేశ్వర్ ఠాకూర్ వెల్లడించారు. 
 
గత 2018 జనవరి ఒకటో తేదీన 14.2 కేజీల గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.741 ఉండేది. ఇపుడు దీని ధర రూ.1053కు చేరింది. అంటే 42.10 శాతం మేరకు పెరిగినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అదేసమయంలో ఎల్పీజీ సిలిండర్లపై కేంద్రం ఇచ్చే రాయితీ మాత్రం 92 శాతం మేరకు తగ్గిపోయింది. 
 
గత 2017-18 మధ్యకాలంలో ఈ సబ్సీడీ మొత్తం విలువ రూ.23,464 కోట్లుగా ఉండగా, 2021-22 నాటికి రూ.1811 కోట్లకు తగ్గినట్టు తెలిపారు. ఐదేళ్ల కాలంలో ఎల్పీజీ సబ్సీడీ పొందే వారి సంఖ్య 20,21,20,070 నుంచి 28,36,77,886కు అంటే 40.35 శాతం మేరకు పెరిగినట్ట ఆయన తెలిపారు. 
 
అదేవిధంగా పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న పన్నుల కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయం గత ఐదేళ్లలో 46 శాతం మేరకు వృద్ధి చెందగా, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయంలో పెరుగుదల 36 శాతంగా ఉందని ఠాకూర్ వివరించారు. 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి పెట్రో ఉత్పత్తుల ద్వారా రూ.31,21,173 కోట్ల మేరకు ఆదాయం వచ్చిందని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments