Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.5 వేల కోట్లు దోచుకున్న బ్యాంకులు... ఎలా?

చేతిలో నిలువదనే ఉద్దేశ్యంతో పైసా పైసా కూడబెట్టి కొంత మొత్తంగా తీసుకెళ్లి బ్యాంకు ఖాతాలో వేసి భద్రపరుచుకుంటాం. కానీ, ఆ బ్యాంకులు మాత్రం ఏవేవో కుంటిసాకులతో ఆ పైసాను పైసాను నిలువుదోపిడి చేస్తున్నాయి.

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (12:00 IST)
చేతిలో నిలువదనే ఉద్దేశ్యంతో పైసా పైసా కూడబెట్టి కొంత మొత్తంగా తీసుకెళ్లి బ్యాంకు ఖాతాలో వేసి భద్రపరుచుకుంటాం. కానీ, ఆ బ్యాంకులు మాత్రం ఏవేవో కుంటిసాకులతో ఆ పైసాను పైసాను నిలువుదోపిడి చేస్తున్నాయి.


తాజాగా దేశంలోని అన్ని బ్యాంకులు కనీస నిల్వ లేదన్న సాకుతో ఏకంగా రూ.5 వేల కోట్లను దోచుకున్నాయి. ఇందులో ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంకు ఏకంగా రూ.2433 కోట్ల మేరకు పెనాల్టీ రూపంలో దోచుకుంది. 
 
ఇటీవల మెట్రో నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ కనీస నిల్వ పాటించాలంటూ అన్ని బ్యాంకులు జీవోను జారీ చేశాయి. ఇదే బ్యాంకులకు మంచివరంగా లభించింది. బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించలేదన్న సాకుతో వినియోదారుల నుంచి బ్యాంకులు రూ.5 వేల కోట్లు దోపిడీ చేశాయి. 
 
ఈ మొత్తాన్ని 21 ప్రభుత్వ, మూడు మేజర్‌ ప్రైవేటు బ్యాంకులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించని ఖాతాదారుల నుంచి జరిమానా రూపంలో వసూలు చేశాయి. భారతీయ స్టేట్ బ్యాంకు అత్యధికంగా రూ.2,433.87 కోట్లు వసూలు చేయగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.590.84 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు చొప్పున జరిమానా రూపంలో వసూలు చేశాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments