Webdunia - Bharat's app for daily news and videos

Install App

#MahaShivaratri : శైవక్షేత్రాల్లో భక్తుల సందడి

మహాశివరాత్రి పర్వదిన వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినం సందర్భంగా దేశంలో ఉన్న అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దుర్గాఘాట్‌లో భక్తుల పుణ్యస్నానాలు చేస్తున్నారు. యనమలకుదురు

Webdunia
మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (09:07 IST)
మహాశివరాత్రి పర్వదిన వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినం సందర్భంగా దేశంలో ఉన్న అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దుర్గాఘాట్‌లో భక్తుల పుణ్యస్నానాలు చేస్తున్నారు. యనమలకుదురు శివాలయంలో భారీగా భక్తులు పూజలు చేస్తున్నారు. 
 
ఇకపోతే.. మహా శివరాత్రి పూజలకు గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని కోటప్పకొండ ముస్తాబైంది. మంగళవారం ఇక్కడ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్లు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఈ తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా కల్పించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు దేశం నలుమూలల నుంచి సుమారు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా కాగా, ఇందుకు తగ్గట్టు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరఫున మంత్రి మాణిక్యాలరావు, స్పీకర్‌ కోడెల పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. పోలీసు భద్రత కూడా కల్పించారు. 
 
ఇకపోతే, శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, అమరావతిలతో పాటు భీమేశ్వరం, కాళేశ్వరం తదితర శైవక్షేత్రాల్లో ఇసుకేస్తే రాలనంత భక్తులు కనిపిస్తున్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత సోమస్కంధమూర్తి భక్తులను అనుగ్రహిస్తున్నారు.  ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
 
అలాగే, యనమలకుదురు రామలింగేశ్వర ఆలయం, కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లిలోని దుర్గా నాగేశ్వరస్వామివారి ఆలయం, విజయవాడ వన్ టౌన్‌లోని శివాలయం, గుంటూరు జిల్లా సత్రశాల, ప్రకాశం జిల్లా పునుగోడు తదితర ప్రాంతాల్లోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

తర్వాతి కథనం
Show comments