క్యాష్ కౌంటర్ పక్కనే నీటి ఫౌంటైన్లు ఎందుకుంటాయో తెలుసా?

Webdunia
సోమవారం, 25 జనవరి 2016 (16:58 IST)
డబ్బు.. సంపద.. జీవితానికి అత్యంత ముఖ్యమైన అంశాలు. మన ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలంటే.. ధనం ఉంచే ప్రాంతాల్లో కొన్ని మొక్కలను పెంచుకోవడం మంచి ఫలితాలనిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో ఎప్పుడూ ధనాన్ని ఉంచే ప్రాంతాల్లో ఎలాంటి చెట్లను పెట్టుకోవాలో, ఎలాంటి రంగులను వాడాలో, ఎలాంటి ఫర్నిచర్‌ను ఉపయోగించాలో తెలుసుకుందాం.
 
ఫెంగ్‌షుయ్ సూత్రాల ప్రకారం సంపదకు, చెక్కకు సంబంధం ఉంది. కలప దొరకాలంటే నీరు, భూమి తప్పనిసరి. అందువల్ల ఈ మూడు శక్తులు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. దీని కోసం ధనాన్ని దాచుకొనే ప్రాంతాల సమీపంలో.. మనీప్లాంట్లు, వెదురు మొక్కలు, అలోవెరా వంటి మొక్కలను ఉంచాలి. అలోవెరాను మొక్కలను ఉంచటం వల్ల గాలిలో ఉండే ప్రతికూల శక్తులు శుద్ధి అవుతాయి.
 
లాఫింగ్ బుద్ధా, చైనీస్ వెల్త్ కాయిన్స్, ఫెంగ్‌షుయ్‌ ఎక్వేరియం వంటివి ఈ ప్రాంతంలో ఉంచుకోవటం వల్ల ధనానికి సంబంధించిన అంశాల్లో లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయి. ఈ ప్రాంతంలో నీరు ఉండాలి. అందుకే చైనాలో చాలా షాపుల్లో క్యాష్ కౌంటర్ పక్కనే నీటితో ఉండే ఫౌంటెన్లు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉంచే ఫ్రేములు కాని ఫర్నిచర్ చతురస్రాకారాలలో ఉండాలి. దీనివల్ల అదనపు శక్తి ఉత్పత్తి అవుతుంది. 
 
నీటితో పాటు దట్టమైన చెట్లు, అడవులు ఉన్న చిత్రాలను కూడా ఉంచాలి. ఈ ప్రాంతానికి ఆకుపచ్చ లేదా నీలం రంగులు వేస్తే మంచిది. ఎక్కువ  ఫెంగ్‌షుయ్ శక్తి అవసరమని భావించేవారు ఎరుపు రంగు కూడా వేయవచ్చు. ఈ ప్రాంతంలో చెడువాసనలు రాకుండా సువాసనను ఇచ్చే పూలను, వాసనలు వెదజల్లే క్యాండిల్స్‌ను ఉంచాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

లేటెస్ట్

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

Show comments