"కోకోనట్ సమోసా" ఎలా తయారు చేస్తారు?

Webdunia
గురువారం, 4 సెప్టెంబరు 2014 (14:49 IST)
కావలసిన పదార్థాలు :
మైదా పిండి.. నాలుగు కప్పులు
నెయ్యి... నాలుగు టీ.
వాము.. రెండు టీ.
ఉప్పు, నూనె.. తగినంత
 
సమోసాల్లో నింపేందుకు..
కొబ్బరితురుము, నువ్వులు.. ఒక్కో కప్పు చొప్పున
కారం, ధనియాలపొడి, సోంపు.. తలా రెండు టీ.
ఇంగువ.. అర టీ.
ఉప్పు.. తగినంత
 
తయారీ విధానం :
ముందుగా మైదా పిండికి వాము, తగినంత ఉప్పు చేర్చి చపాతీ పిండిలా కలిపి ఓ అర్థగంట నానబెట్టాలి. బాణలిలో కొద్దిగా నెయ్యి వేడిచేసి కొబ్బరి తురుము, నువ్వులను విడి విడిగా వేయించి ఉంచాలి. నువ్వులు చల్లారిన తర్వాత పొడిచేసి ఉంచాలి. ఇప్పుడు నువ్వులపొడి, కొబ్బరి తురుము, సోంపు, వాము, ధనియాలపొడి, ఇంగువ, కారంపొడిలను ఒక పాత్రలో వేసి బాగా కలియబెట్టాలి. మైదాను చిన్న చిన్న పూరీల్లా చేసి చాకుతో రెండు భాగాలుగా కోయాలి.
 
ఒక్కోదాంట్లో పై పొడి మిశ్రమాన్ని మూడు టీస్పూన్లు వేసి నీటితో తడుపుతూ చివర్లు సమోసా షేప్‌లో మూసివేయాలి. అలా మొత్తం పిండినంతా చేసుకుని బాగా మరుగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి న్యూస్‌ పేపర్‌పై పరవాలి. అంతే వేడి వేడి కొబ్బరి సమోసాలు తయార్. వీటిని వేడిగా ఉన్నప్పుడే టొమోటో సాస్ లేదా చింతపండు సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కూడా.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

క్రికెట్ మ్యాచ్ చూసేందుకు కొలంబో వెళ్లాలా? టీవీలో చూడొచ్చుగా: లోకేష్ పైన జగన్ విసుర్లు

పశు వికాస్ డే ద్వారా సర్వోత్తం సేవలో ముందంజలో ఉన్న SMFG ఇండియా క్రెడిట్

క్రికెటర్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు .. ఎందుకో తెలుసా?

వైకాపా హయాంలో ఎక్సైజ్, మైనింగ్ ఆదాయ తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది : మంత్రి పయ్యావుల

మేనల్లుడి మెహందీ వేడుకలో నృత్యం చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన మేనమామ, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Arjun: నాలుగు రోజుల్లో 8.7 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన సీతా పయనం

Hebba Patel: మిరాకిల్ చేద్దాం రండి అంటున్న హెబ్బా పటేల్

హే బల్‌వంత్ మెమరబుల్ ఫిల్మ్ అవుతుంది ఫ సీనియర్ నరేష్

DSP: ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ ప్రోమో - పవన్ కు గిఫ్ట్ ఇది : దేవీశ్రీ ప్రసాద్

DiL Raju: నిర్మాత అంటే విలువలేదు - కానీ సినిమా తీస్తా : దిల్ రాజు

Show comments